టీడీపీలో “కర్నూలు” పంచాయతీ ఎవరో ఒకరు పార్టీ మారేదాకా తెగదా..?

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలను ఒకే ఒరలో ఇమడ్చగలిగిన .. టీడీపీ అధినేతకు.. మరికొన్ని నియోజకవర్గాలకు అంతకు మించిన సవాళ్లు సృష్టిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వలస వచ్చిన నియోజకవర్గాలే ఉన్నాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. టిక్కెట్లు ఆశిస్తున్న ఇద్దరు నేతలు.. ఒకరిపై ఒకరు పోటీ పడి విమర్శలు చేసుకుంటున్నారు. మధ్యలోకి లోకేష్‌ను తీసుకొస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. గత ఎన్నికల్లో…వైసీపీ తరపున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ వెంకటేష్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోనే కొనసాగాలనుకున్నారు కానీ.. భూమా నాగిరెడ్డి సమీప బంధువు ఎస్వీ మోహన్ రెడ్డి కావడంతో.. భూమా పార్టీ మారిన తర్వాత.. ఆయనను కూడా జగన్ దూరం పెట్టారు. దీంతో .. టీడీపీలో చేరిపోవాల్సి వచ్చింది.

ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత పరిస్థితుల్ని సరిదిద్దడానికి.. టీజీ వెంకటేష్‌కి..రాజ్యసభ అవకాశం కల్పించారు చంద్రబాబు. అయితే.. టీజీ మాత్రం.. తన కుమారుడు టీజీ భరత్‌ను.. రేసులోకి తీసుకొచ్చారు. తన కుమారుడుకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని.. పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట… కర్నూలు పర్యటనకు వచ్చిన లోకేష్‌.. ఎస్వీ మోహన్ రెడ్డికి అనధికారికంగా టిక్కెట్ ప్రకటించారు. అప్పట్నుంచి.. కర్నూలు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గెలిచే వాళ్లకే టిక్కెట్ ఇస్తారని..అది తమకేనని టీజీ వెంకటేషన్ పదే పదే చెబుతున్నారు. పోటీ చేస్తే లోకేష్ పోటీ చేయాలి కానీ.. ఇతరులకు ఇస్తే ఒప్పుకోబోమని.. ఎస్వీ మోహన్ రెడ్డి అంటున్నారు.

ఈ క్రమంలో ఒకరిని పార్టీలోకి ఆకర్షించేందుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలులో ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ మారిన ఓ తర్వాత ఓ ముస్లిం అభ్యర్థిని ఇన్చార్జ్‌గా పెట్టినప్పటికీ.. బలమైన అభ్యర్థి కారన్న ఆలోచన.. ఆ పార్టీ వర్గాల్లో ఉంది. టీజీ వర్గీయులకు.. వైసీపీ నేతలు.. ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించారని చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. కర్నూలు అసెంబ్లీ విషయంలో మరో ట్విస్ట్ కూడా.. ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో చేరబోతున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వర్గం.. కూడా.. కర్నూలు టిక్కెట్‌ను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు… కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇష్యూ.. టీడీపీకి పరిష్కరించంలేని సమస్యగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close