బండ్ల గణేష్‌నూ వదిలి పెట్టలేదా..? రాజకీయ సన్యాసమట..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో… కాంగ్రెస్ పార్టీలో చేరి.. హడావుడి చేసిన … నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజేంద్రనగర్ లేదా జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం.. ఆయన చేయని ప్రయత్నం లేదు. అన్నీ చేసి.. చివరికి…ఏ టిక్కెట్టూ దక్కించుకోలేకపోయారు. అయినప్పటికీ..ఆయన ప్రచారం విషయంలో టీవీ చానళ్ల వద్ద హడావుడి చేశారు. కొన్ని విచిత్రమైన మేనరిజమ్స్‌తో… తెలంగాణ సర్కార్ పై సెటైర్లు వేశారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ… కాంగ్రెస్ గెలవకపోతే… బ్లేడుతో కోసుకుంటానని సవాల్ చేశారు. అయితే కాంగ్రెస్ గెలవలేదు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఎవరూ పట్టించుకోలేదు కూడా..!

అయితే హఠాత్తుగా.. ఆయన ఓ ట్వీట్ చేశారు. తాను.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అధికార ప్రతినిధి హోదాకు .. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. తనకు అవకాశం కల్పించిన రాహుల్‌, ఉత్తమ్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. తనకు ఇక ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పేశారు. ఇంత హఠాత్తుగా.. ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకున్నారన్నదానిపై.. ఆయన స్పందించడం లేదు కానీ.. కొద్ది రోజులుగా.. టాలీవుడ్ నటులపై ఉన్న రాజకీయ ఒత్తిడే కారణమన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌లో చిన్నా, చితకా నటులంతా… కొంత మంది ప్రొద్భలంతా… వైసీపీలో చేరుతున్నారు. వారిపై ఒత్తిడి ఉందని.. టాలీవుడ్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

అలాంటి ఒత్తిడే.. బండ్ల గణేష్‌పై కూడా ఉందని… ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల్లో చేరకపోయినా పర్వాలేదు… కానీ కాంగ్రెస్‌లో ఉండకపోతే.. తనకు టెన్షన్లు ఉండవని.. బండ్ల భావించినట్లు తెలుస్తోంది. అసలు రాజకీయాల జోలికి వెళ్లకపోతే తనకే తిప్పలు ఉండవని అనుకున్నట్లుగా ఆయన ట్వీట్లు ఉన్నాయి. బండ్ల రాజకీయ జీవితం… అలా ప్రారంభమై.. అలా ముగిసిపోయింది. పవన్ కల్యాణ్ భక్తుడిగా ఆయన జనసేనలో యాక్టివ్ గా ఉండి ఉంటే… పవన్ ఏపీలో ఎక్కడో ఓ చోట టిక్కెట్ సర్దుబాటు చేసి ఉండేవారు. కానీ బండ్ల కాంగ్రెస్‌లో చేరి.. ఆ అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు రాజకీయాలకే దూరం కావాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close