రుణమాఫీ నాలుగో విడత నిధులు కూడా..! టీడీపీ వస్తేనే ఐదో విడత..?

రైతులకు లక్షన్నర రుణమాఫీ చేసిన ఏపీ ప్రభుత్వం.. వాటిని.. విడతల వారీగా విడుదల చేస్తోంది. ఐదు సంవత్సరాలలో రైతులకు లక్షన్నర రూపాయల మేరకు ఐదు విడతలలో మాఫీ చేయాలని నిర్ణయించింది. మొత్తం రూ. 25 వేల కోట్ల రుణాల్లో ఇప్పటికే మూడు విడతలలో రూ. 15 వేల 670కోట్లను రైతులకు విడుదల చేసింది. నాలుగు, ఐదు విడతల కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. యాభై వేల రూపాయల లోపు రుణాలు ఉన్న రూ. 23 లక్షల 45వేల మంది రైతులకు రూ. 4 వేల 337కోట్ల రూపాయలను ఒకే విడతలో మాఫీ చేసింది. కౌలు రైతులకు రూ. 494 కోట్లనువిడుదల చేసింది.

ఇప్పుడు నాలుగు, ఐదు విడతల రుణమాఫీ కింద రైతులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన నాలుగో విడత రుణమాఫీ కింద రూ. 3వేల 600కోట్ల రూపాయలను రైతులకు విడదల చేయనుంది. బ్యాంకులలో ఉన్న రైతుల ఎకౌంట్లకు జమ చేసేందుకు ఆర్ధిక శాఖ బ్యాంకులకు నిధులను విడుదల చేయనుంది. 58 లక్షల మంది రైతులకు ఈ డబ్బులు అందనున్నాయి. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద ఒకే విడతలో రుణాన్ని మాఫీ చేశారు. పోలింగ్ కు 48గంటల ముందు ఒకవైపు డ్వాక్రా మహిళలు 98లక్షల మందికి, పదివేల రూపాయల చొప్పున పసుపు కుంకుమ పధకం కింద ప్రభుత్వం విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ పధకం, రుణమాఫీ పధకాల కింద సుమారు రూ. 5వేల కోట్లను విడుదల చేసింది. పెన్షనర్లకు ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయల చొప్పున 56లక్షల మందికి పెన్షన్లను కూడా ఇప్పటికే అందించింది. ఇవన్నీ ఓట్లు పండిస్తాయని టీడీపీ ఆశ పెడుతోంది.

మరి ఐదో విడత రుణమాఫీ ఎప్పుడు చేస్తారు..?. మళ్లీ జగన్ వస్తే టీడీపీ హామీని తాము ఎందుకు అమలు చేయాలన్న ఉద్దేశంతో.. కచ్చితంగా పక్కన పెట్టేస్తారు. ఆ విషయంలో రైతులకు అవగాహన ఉంటుంది. అందుకే.. టీడీపీ కూడా వ్యూహాత్మకంగా.. ఓ వాయిదాను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ టీడీపీ వస్తే.. అది కూడా మాఫీ అవుతుందన్న భావన రైతుల్లో ఏర్పడటానికి ఇలా చేస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి… అన్ని వర్గాల ప్రజలకు.. సాయం అందేలా… ఓ పక్కా ప్రణాళిక ప్రకారం.. టీడీపీ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటోందని..వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close