ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం జనాలను వెర్రివాళ్ళను చేయడమే.అక్రమాస్తుల కేసులో బెయిల్ పొందేందుకు వైఎస్సార్ పేరును కూడా సీబీఐ చార్జీషీట్ లో చేర్పించిన ఘనుడు జగన్ అని, అధికారం కోసం సొంత చిన్నాన్న హత్యను కూడా వాడుకున్నాడని షర్మిల పలు విషయాలను బయటపెడుతున్నారు. అయినా షర్మిలను జనం విశ్వసించరని…తను చెప్తున్నా మాటలనే పరిగణనలోకి తీసుకుంటారని జగన్ అంచనా వేస్తుండటం జనాలను అవమానించడమే.

షర్మిల వాయిస్ ను జనాల్లోకి వెళ్ళకుండా మీడియాను మేనేజ్ చేస్తోన్న జగన్ ప్రజలను కూడా అమాయకులుగా భావిస్తున్నారు. జగన్ సీఎం అయ్యేందుకు అహర్నిశలు శ్రమించిన షర్మిలకు పసుపు ట్యాగ్ పూసేశారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఎందుకు వెనకేసుకోస్తున్నారన్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం బాకీ పడే ఉన్నారు. ఇలా పలు విషయాలపై ఆమె ఆధారాలతో మాట్లాడుతోన్నా వాటికి సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు కోవర్ట్ అంటూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.

తన రాజకీయంతో సొంత చెల్లినే అపఖ్యాతి పాలు చేస్తోన్న జగన్ రెడ్డి ప్రజలను అమాయకులుగా భావిస్తారని అనుకోవడంలో అతిశయోక్తి లేదు.తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పిచ్చిగా జనాలు తనను ఆదరిస్తారనే జగన్ నమ్మకం ప్రజలను అమాయకులుగా భావించడమే. పాలకుల మనస్తత్వం ఇలా ఉండటం వ్యవస్థలకే కాదు… ప్రజలకు కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ఫోకస్

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం... అటు...

మరికాసేపట్లో భారీ వర్షం…ఎవరూ బయటకు రావొద్దని అలర్ట్..!!

హైదరాబాద్ లో మరికాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని...

సీరియల్ న‌టుడు చందు ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణాలు ఇవేనా?

బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. కారణం త్రినయని సీరియల్ యాక్టర్స్ వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవ‌డ‌మే. మొదట ఈ సీరియల్ లో కీల‌క పాత్ర పోషించిన‌ పవిత్రా జయరాం యాక్సిడెంట్...

అప్పుడే చంద్రబాబు ఆన్ డ్యూటీ..!!

అల్లర్లతో ఏపీ అట్టుడుకుతుంటే సీఎంగా తన బాధ్యతను జగన్ రెడ్డి విస్మరించి విదేశాలకు వెళ్ళగా... ఇప్పుడు ఆ బాధ్యతలను చంద్రబాబు నిర్వర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళడంతో చంద్రబాబు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close