మీడియా వాచ్ : బీబీసీని వెళ్లగొట్టినట్లే !

బీబీసీ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఇండియాలో తన లైసెన్స్‌ను తన మాజీ ఉద్యోగులు పెట్టిన కంపెనీకి అప్పగించింది. భారత్‌లోని తన న్యూస్‌రూమ్‌ను మూసేసింది. నలుగురు బిబిసి మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీకి బిబిసి ప్రచురణ లైసెన్సును అప్పగించింది.

1940లో భారత్ లో బీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల కిందట ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించింది. కరోనా తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది బీబీసీ. అయితే 2021లో కేంద్రం దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతమేనని తేల్చింది. ఆ పరిమితి దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి వచ్చింది.

బిబిసి ఇండియాలో 99.9 శాతం ఎఫ్‌డిఐ కావడంతో ఆ కొత్త నిబంధన గుది బండగా మారింది. విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కలెక్టివ్ న్యూస్ రూమ్ కు బీబీసీ పూర్తి మద్దతు ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసింది బీబీసీ మాజీ ఉద్యోగులే. బీబీసీని టార్గెట్ చేసి గతంలో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన తర్వాత నుంచే.. అసలు ఆ సంస్థను సాగనంపే కార్యక్రమాలు జరిగాయి. బీబీసీకి ఇండియాలో చోటు లేకపోవడం.. ఓ రకంగా భారత్ ఇమేజ్ ను.. ప్రపంచ మీడియా రంగంలో కాస్త పలుచన చేసేదేనని నిపుణుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close