మీడియా వాచ్ : బీబీసీని వెళ్లగొట్టినట్లే !

బీబీసీ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఇండియాలో తన లైసెన్స్‌ను తన మాజీ ఉద్యోగులు పెట్టిన కంపెనీకి అప్పగించింది. భారత్‌లోని తన న్యూస్‌రూమ్‌ను మూసేసింది. నలుగురు బిబిసి మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీకి బిబిసి ప్రచురణ లైసెన్సును అప్పగించింది.

1940లో భారత్ లో బీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల కిందట ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించింది. కరోనా తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది బీబీసీ. అయితే 2021లో కేంద్రం దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతమేనని తేల్చింది. ఆ పరిమితి దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి వచ్చింది.

బిబిసి ఇండియాలో 99.9 శాతం ఎఫ్‌డిఐ కావడంతో ఆ కొత్త నిబంధన గుది బండగా మారింది. విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కలెక్టివ్ న్యూస్ రూమ్ కు బీబీసీ పూర్తి మద్దతు ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసింది బీబీసీ మాజీ ఉద్యోగులే. బీబీసీని టార్గెట్ చేసి గతంలో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన తర్వాత నుంచే.. అసలు ఆ సంస్థను సాగనంపే కార్యక్రమాలు జరిగాయి. బీబీసీకి ఇండియాలో చోటు లేకపోవడం.. ఓ రకంగా భారత్ ఇమేజ్ ను.. ప్రపంచ మీడియా రంగంలో కాస్త పలుచన చేసేదేనని నిపుణుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close