బ‌న్నీ సినిమా… ‘బ్యాన‌ర్‌’ లొల్లి

‘పుష్ష 2’ త‌ర‌వాత‌ అల్లు అర్జున్ సినిమా ఫిక్స‌యిపోయింది. అట్లీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే.. ఇంకా తేలాల్సిందేంటంటే… ఈ సినిమా ఏ బ్యాన‌ర్ లో చేయాలి? అన్న‌దే. బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. కానీ రాలేదు. దానికి కార‌ణం.. బ్యాన‌ర్ విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డ‌మే.

అట్లీ… ఇప్పుడు స‌న్ పిక్చర్స్ సంస్థ‌లో ఓ సినిమా చేయాలి. బ‌న్నీ సినిమాని అదే బ్యాన‌ర్‌లో చేయాల‌ని త‌ను భావిస్తున్నాడు. అయితే కాంబినేష‌న్ ప‌రంగా ఉన్న క్రేజ్ ని చూసి, గీతా ఆర్ట్స్ ఈ సినిమాని సొంతంగా చేయాల‌ని అనుకొంటోంది. దానికి అట్లీ అభ్యంత‌రం చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆల్రెడీ స‌న్ కి మాట ఇచ్చేశాడు కాబ‌ట్టి, అట్లీకి మ‌రో మార్గం లేదు. బన్నీ మాత్రం ఈ సినిమాని ఓన్ బ్యాన‌ర్‌లో చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంద‌ని అనుకొంటున్నాడు. అక్క‌డే డిస్క‌ర్ష‌న్స్ జోరుగా న‌డుస్తున్నాయి. మ‌ధ్యే మార్గంగా స‌న్ పిక్చ‌ర్స్ తో పాటుగా, గీతా ఆర్ట్స్ క‌లిసి ఈ సినిమా చేసే ఛాన్సుంది. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాని అలానే పూర్తి చేశారు. హారిక హాసినితో పాటు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు కూడా అదే ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close