దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన రాసలీలు దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. మీ వీడియోలు ఉన్నాయంటే.. మీ వీడియోలు ఉన్నాయని నేతలు పరస్పరం ఆరోపించుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ జాబితాలోకి హసన్ ఎంపీ, దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ చేరారు. ఆయన బంధువైన ఓ నయస్కురాలితో చేసిన లీలులు వీడియోలుగా బయటకు వచ్చాయి. దాంతో ఆమె తనను వేధించారని కేసు పెట్టింది. దీంతో ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు.

ప్రజ్వల్ ఈ సారి కూడా హసన్ నుంచి పోటీ చేస్తున్నారు. హసన్ దేవేగౌడ నియోజకవర్గం. ఆయన వయసు భారం పెరిగిపోవడంతో మనవడికి చాన్సిచ్చారు. పెద్ద కుమారుడు అయిన హెచ్‌డీ రేవణ్ణ కుమారుడికి హసన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఒక్కరే గెలిచారు. ఈ సారి బీజేపతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లలో పోటీ చేస్తున్నారు. మూడు సీట్లలో ఒకటి హసన్. మోడీ కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. రెండో విడతలో కర్ణాటకలో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

బీజేపీకి ఎలా స్పందించాలో తెలియక కిందా మీదాపడుతోంది. మరో వైపు ఇదే చాన్స్ అనుకుని ప్రజ్వల్ పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆరోపణలు చేస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం వీటి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమంచింది. రెండో విడతలో మరో పధ్నాలుగు లోక్ సభ నియోజవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిపై ప్రభావం పడితే మొదటికే మోసం వస్తుందని.. బీజేపీ కూటమి కంగారు పడుతోంది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో.. తెలియక దేవేగౌడ ఫ్యామిలీ కిందా మీదాపడుతోంది. డీప్ ఫేక్ అనడానికి కూడాలేనంత క్లియర్ గా దృశ్యాలు ఉన్నాయి. బాధితురాలు కూడా బయటకు వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close