ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే… ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే… థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి ‘రాజా సాబ్‌’లో ఉంది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఇందులోని ప్ర‌భాస్ లుక్ ఇప్ప‌టికే ఆయ‌న అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకొంటోంది. స్టైలీష్‌గా, కూల్ వింటేజ్ లుక్‌లో ప్ర‌భాస్ ని చూసి ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ఫ్యాన్స్ తో ఈల వేయించే మూమెంట్స్ కు కొద‌వ లేకుండా చూసుకొంటున్నాడు మారుతి. అందుకే చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఈ సినిమాలో పొందుప‌రిచారు. అందులో ఓ పాట ఉంది.

ప్ర‌భాస్ స్టైల్‌గా స్టెప్పులు వేసి చాలాకాలం అయ్యింది. ఆ లోటు ‘రాజా సాబ్తో’ తీర‌బోతోంది. ఇందులో నిధి అగ‌ర్వాల్, రిద్ది కుమార్‌, మాళ‌విక మోహ‌న‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ ముగ్గురితో ప్ర‌భాస్ ఆడి పాడేలా ఓ పాట డిజైన్ చేశారు. ఈ పాట థియేట‌ర్ల‌ని ఓ ఊపు ఊపేయ్య‌బోతోంద‌ని టాక్. ప్ర‌భాస్ తో మాసీ స్టెప్పులు వేయించాల‌న్న ల‌క్ష్యంతోనే మారుతి ఈ పాట‌ని డిజైన్ చేశార్ట‌. ఓ స్టార్ హీరో ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు ఆడిపాడే సీన్ చూసి చాలాకాలం అయ్యింది. ఈ త‌రంలో ఏ హీరోకీ ఈ ఛాన్స్ రాలేద‌నే చెప్పాలి. ఇటీవ‌లే `రాజాసాబ్‌`కు సంబంధించిన ఓ కీల‌క‌మైన షెడ్యూల్ పూర్తయ్యింది. వ‌చ్చే నెల‌లో మ‌రో షెడ్యూల్ మొద‌లుకానుంది. ఇప్ప‌టికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. 2025 ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close