కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం .. జగన్ సతీమణి భారతిరెడ్డి రంగంలోకి దిగారు. ఆమె గత ఎన్నికల్లో పులివెందులలో ప్రచారం చేశారు. ఆమె ప్రచార స్టైల్ భిన్నంగా ఉంటుంది. జగన్ గెలిస్తే మీ ఇంటికి ఇన్ని డబ్బులొస్తాయని చెబుతూ ఉంటారు. పోయిన సారి ఆమె చేసిన ప్రచార వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.

షర్మిల కోసం.. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. సునీత ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కోసం..రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన షర్మిల ఒకటో తేదీ నుంచి పూర్తిగా కడప నియోజకవర్గానికే పరిమితమవనున్నారు. ఆమె కోసం రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ వంటి వారు ప్రచారం చేసే అవకాశం ఉంది. షర్మిల కోసం .. బ్రదన్ అనిల్ పరోక్ష ప్రచారం ప్రచారం ప్రారంభించారు., కడపలో చర్చి పాస్టర్లతో సమావేశాలు పెట్టి పాపాలు చేసిన వాళ్లను తొక్కి పడేయాలని పిలుపునిస్తున్నారు. షర్మిల కోసం చాలా మంది కుటుంబసభ్యులు బయటకు వస్తున్నారు. బయటకు రాలేని వాళ్లు అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారు.

ఈ సారి ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయలక్ష్మి కనిపించే అవకాశం లేదు. గతంలోకుటుంబం అంతా ఏదో చోట ప్రచారం చేస్తూనే ఉండేవారు. ఈ సారి మాత్రం ఎవరికి వారు అయ్యారు. ప్రధానంగా కడపకే పరిమితమవుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత వైఎస్ కుటుంబంలో చీలిక పూర్తి స్థాయిలో బయటకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close