టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..? అనే అంశాలపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ లు.. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ గా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపోటములపై ఏపీ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా ఈ నలుగురు టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు. జగన్ ను ఏమైనా అంటే అంతెత్తున లేచేవారు. కాని, ఈ ఎన్నికల్లో వీరు ఎదురీత ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కొడాలి నాని..2004నుంచి వరుసగా గుడివాడలో గెలుస్తూ వస్తోన్న ఆయనకు ఈసారి కొంత ఇబ్బందికర పరిణామాలు తప్పేలా లేవు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు స్థానికంగా కొడాలి నానిపై వ్యతిరేకత పెరగడంతో ఈసారి భంగపాటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.అయితే, హోరాహోరీ పోరులో స్వల్ప ఓట్ల ఆధిక్యంతో నాని గెలుపొందే అవకాశం ఉందని సమాచారం.

రోజా.. నగరి నుంచి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కాని, గ్రౌండ్ లో ఆమెకు పరిస్థితి అనుకూలంగా లేదన్నది ఓపెన్ సీక్రెట్. రోజాకు టికెట్ ఇచ్చినా గెలవదని పార్టీ నేతలు మొదటే జగన్ దృష్టికి తీసుకెళ్ళినా ఆయన మాత్రం రోజాపైనే నమ్మకం ఉంచారు. అయినప్పటికీ నేతలను సమన్వయం చేసుకోవడంలో రోజా విఫలమయ్యారు. పోలింగ్ ముగిశాక తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు పన్నారని ఆరోపించడంతో రోజా తన ఓటమిని ముందే అంగీకరించారా అనే ప్రచారం జరిగింది.

అంబటి రాంబాబుది కూడా అదే పరిస్థితి. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తోన్న ఆయన స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో అంబటికి నిరాశ తప్పదనే విశ్లేషణల నేపథ్యంలోనే ఆయన టీడీపీకి అనుకూలంగా ఈసీ పని చేసిందని తాజాగా ఆరోపించడం కొత్త చర్చకు తెరలేపింది. సత్తెనపల్లి ట్రెండ్స్ అర్థమయ్యే ఓటమి భయంతోనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అంటోంది.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు . టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు చేతిలో అనిల్ కు ఓటమి తప్పదని అంచనా వేసే పోలిసులపై పోలింగ్ ముగిశాక ఆరోపణలు చేశారని ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close