“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న లోపాలను లాయర్లు విశదీకరిస్తూంటే జనానికి మైండ్ బ్లాంక్ అవుతోంది. దీనిపై వైసీపీ నేతలు చేస్తున్నప్రకటనలు ప్రజల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని అంగీకిరిస్తున్నట్లుగా ఇప్పుడు అమలు చేయడం లేదని చెబుతున్నారు. కొంత మంది ఇలా చెబుతూంటే.. కొంతమంది అమలవుతోందని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి లాంటి వారు జగన్ వెనక్కి తగ్గబోరని చట్టం అమలు చేసి తీరుతారని మరింతగా భయపెడుతున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం పేరుతో టీడీపీ చేస్తున్న ప్రచారం ట్రాప్ లో వైసీపీ నేతలంతా పడిపోయారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. మరింతగా భయపెడుతున్నారు. ఇది సమస్యగా మారుతోంది.

గ్రామాల్లో ఎన్ని భూ సమస్యలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ భూసమస్యలను అడ్డంపెట్టుకుని తమ ఆస్తుల్ని వైసీపీ నేతలు లాగేసుకుంటారన్న భయంతో ఎక్కువ మంది ఉన్నారు. రెడ్డి … క్రిస్టియన్ అనే తేడాలేకుండా అందరిలోనూ అదే భయం కనిపిస్తోంది. దీన్ని వైసీపీ నేతలు మరింత పెంచుకుంటున్నారు తప్ప.. ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. తీసేస్తామంటే.. తప్పుడు చట్టం తెచ్చినట్లే కదా అని అంటారు… ఉంచుతామంటే.. భూములు కొల్లగొడతారా అని విమర్శిస్తారు. ఎలా చూసినా.. వైసీపీకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెను సమస్యగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close