ఒక్క ఓటు- ఫలితాలను మార్చిన సందర్భాలు ఎన్నో !

మొత్తానికి ఎన్నికల రోజు రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో లక్షలాదిమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎందుకనో కొంతమంది మాత్రం, ఎన్నికల సమయంలో నాలుగడుగులు వేసి ఓటు వేయడానికి బద్దకిస్తుంటారు. నా ఒక్కడి ఓటు వల్ల ఏం జరుగుతుందిలే అన్న అభిప్రాయం కూడా ఇందుకు ఒక కారణం. అయితే ఒక్క ఓటుతో ఫలితాలు మారిపోయిన ఘటనలు భారతదేశ ఎన్నికల చరిత్రలో చాలానే కనిపిస్తాయి.

ఉదాహరణకి, 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువ నారాయణకు వచ్చిన ఓట్ల సంఖ్య 40, 752. రెండవ స్థానంలో నిలిచిన అభ్యర్థి జనతా దళ్ పార్టీకి చెందిన కృష్ణమూర్తి. ఇతనికి వచ్చిన ఓట్ల సంఖ్య 40, 751. అంటే కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడన్న మాట. అలాగే వైఎస్సార్సీపీ తరఫున 2014లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మెజార్టీ కేవలం 12 ఓట్లు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన స్థానాలు 18 అయితే, పదివేల లోపు ఓట్ల మార్జిన్ తో ఓడిపోయిన స్థానాలు 26. వీటిలో 3000 లోపు ఓట్లతో ఓడిపోయిన స్థానాలలో ప్రజారాజ్యం గెలిచినా కూడా 2009లో రాజకీయ పరిస్థితి మరొక రకంగా ఉండేది.

కాబట్టి ఒక్క ఓటుతో ఏం మారిపోతుందిలే అనుకునేవాళ్ళు, నేను ఒక్కడు ఓటు వేయక పోయినంతమాత్రాన ఏమవుతుందిలే అనుకునేవాళ్ళు, పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎన్నో కీలక నిర్ణయాలు ఒక్క ఓటు తేడాతో మారిన సంఘటనలు ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close