ఈవీఎంల మొరాయింపు, దాడులు అన్నీ ప్రణాళిక ప్రకారమే చేశారంటున్న చంద్రబాబు

ఈవీఎంలు ఓ ప్రణాళిక ప్రకారం.. పని చేయకుండా చేసి… ప్రీలోడెడ్ ఈవీఎంలతో రీప్లేస్ చేశారని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం… ఎప్పుడూ లేనంతగా ఏకంగా 31శాతం ఈవీఎంలు పని చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సాక్షాత్తూ ద్వివేదీనే…. ఓటు వేయలేకపోయారని… గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు ఈవీఎంలను రీప్లేస్ చేశారన్నారు. ప్రజల భవిష్యత్ ను.. మెషిన్‌కు వదిలేశారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయాన్ని బీజేపీ బ్రాంచ్ ఆఫీసుగా మార్చారని మండిపడ్డారు. పోలింగ్ కు ఇరవైనాలుగు గంటల ముందు కూడా.. అధికారుల్ని బదిలీ చేసి.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామని… సూచనలు పంపారని.. దానికి తగ్గట్లుగానే.. వ్యవహారాలు జరిగాయన్నారు. ఇంత పనికి మాలిన ఈసీని తన జీవితంలో చూడలేదన్నారు.

ఢిల్లీలో బీజేపీ, ఇక్కడ వైసీపీ ఏది చేస్తే అదే చేశారని… మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఎప్పుడైనా ఎన్నికల సమయంలో రౌడీయిజనమేదే కనిపించలేదని.. ఈ సారి … రాజమండ్రి లోక్ సభ టీడీపీ అభ్యర్థి మాగంటి రూపపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని అడిగితే.. ఆరు రోజుల సమయం పడుతుందని… ఈసీ కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తోందని.. గతంలో ఒక్క రోజులోనే కౌంటింగ్ పూర్తయ్యేది కాదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయంపై తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇంత జరిగిన తర్వాత ఈవీఎంలపై ఎవరికైనా నమ్మకం ఉంటుందా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దారుణంగా.. . ఎన్నికల నిర్వహణ ఉంటే.. వైసీపీ నేతలు మాత్రం.. ఈసీని ఎందుకు పొగుడుతున్నారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రకియ ప్రారంభమైనప్పటి నుంచి ఈసీ వ్యవహరించిన తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలనుకున్నప్పుడు.. ముఖ్యమంత్రితో సంప్రదించరా.. అని ప్రశ్నించారు. ఇంటలిజెన్స్ చీఫ్ ను తప్పిస్తే… భద్రత విషయంలో తలెత్తే అనుమానాలు ఎవరు తీరుస్తారని మండిపడ్డారు. మోడీకి, కేసీఆర్ కు భయపడి ఉంటే.. రాష్ట్రాభివృద్ధి జరిగేదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో ప్రజలు ఓట్లు వేయకుండా… మోడీ , కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారని.. అయినప్పటికీ.. ప్రజలు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. ఎక్కడైనా పోలింగ్ … మందకొండిగా ప్రారంభమై ఉధ్ధృతం అవుతుందని … కానీ ఏపీలో మాత్రం ఉదయం నుంచి జనం బారులు తీరారన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఏపీకి.. ఓట్లు వేయడానికి వచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close