వంద గార్యంటీ, ఇది కెసిఆర్‌ మాట..

Telakapalli-Raviజిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్‌ తొలి ఘట్టం మందకొడిగానే వుంది. పార్టీలు ఎంతగా పోట్లాడుకున్నా నగర వాసులు మాత్రం ఉత్సాహంగా తరలి వచ్చినట్టు కనిపించలేదు. బహుశా యాభై శాతం దాటితే గొప్ప కావచ్చు.

ఈ ఎన్నికల సందర్భంలోనే తునిలో హింసాత్మక ఘటనలు జరగడంపై టిడిపి మిత్రులు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కెసిఆర్‌కు సహాయపడేందుకే కాపునాడు పేరిట కల్లోలం సృష్టించారని వారి ఆరోపణ. వైసీపీ పోటీ చేయకపోవడం వల్ల సీమాంధ్ర ఓట్లు చీలకుండా తెలుగుదేశంకు వచ్చే అవకాశం వుండేది. ఇప్పుడు ఒక వర్గం దూరమవుతుందనేది వారి వాదన. అయితే అదే సమమయంలో అనుకూలంగా వుండేవారు మరింత గట్టిగా టిడిపి వైపు వచ్చే అవకాశం వుంటుంది కదా అనే వాదన మరొకటి వినిపిస్తున్నది.

షరామామూలుగా ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు నడుస్తున్నాయి. మిగిలినవారి అంచనాలు పక్కనపెట్టి అసలు మూలవిరాట్టయిన కెసిఆర్‌ లెక్క ఎలా వుంది? నిన్న రాత్రి ఆయన తమకు వంద సీట్లకు పైగానే వస్తాయని చెప్పారని టిఆర్‌ఎస్‌ ఎంపి ఒకరు వెల్లడించారు. గతంలో వరంగల్‌ ఎన్నికల సమయంలో కెసిఆర్‌ వీరిని అంచనాలు అడిగారట. వీరంతా లక్ష రెండు లక్షలు అని చెబుతుంటే కెసిఆర్‌ వాటిని కొట్టి పారేశారట. ప్రతిపక్షాలకు డిపాజిట్టు రావు, మనకు అయిదు లక్షల మెజార్టి వస్తుందని జోస్యం చెప్పారట. అది నిజమైనట్టే ఇప్పుడు జిహెచ్‌ఎంసిలోనూ వంద వస్తాయనేది వారి ఆశ. మరైతే మిగిలిన వారికి రావా అంటే కాంగ్రెస్‌కు రావు. మజ్లిస్‌కు ముప్పై వస్తే టిడిపికి పదో పదిహేనో వస్తాయి.. చూడండి మీకే తెలుస్తుంది అని ముక్తాయించాడా ఎంపిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close