తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో జనసేన పోటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవరేమనుకున్నా.. తన పార్టీ విషయంలో.. స్లో అండ్ స్టడీ పద్దతి పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో వచ్చిన విమర్శలను.. చేతల ద్వారానే తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను పెట్టిన జనసేనాని.. ఈ సారి రూట్‌ లెవల్లో బలపడటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. గ్రామ స్థాయిలో పోటీ జరిగే.. పరిషత్ పోరాటంలో పాల్గొనే ప్రయత్నంలో ఉన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థుల్ని నిలబెట్టాలనే ఆలోచన పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ నాయకత్వానికి స్పష్టమైన సూచనలు పంపారు.

తనకు అధికారం ముఖ్యం కాదని.. పవన్ కల్యాణ్ పదే పదే చెబుతూంటారు. అదే సమయంలో.. పాతికేళ్ల రాజకీయం చేస్తానని చెబుతూ ఉంటారు. తెలంగాణలో.. గ్రామస్థాయి నుంచి బలపడే ఆలోచన ఉండటంతో… దానికి పరిషత్ ఎన్నికలు మంచి అవకాశం అని.. జనసేనకు చెందిన నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయంలో… కొంత మంది పార్టీ క్యాడర్ కూడా.. పోటీకి ఉత్సాహం చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అన్ని స్థానాల్లో కాకపోయినా… కొన్ని కొన్ని స్థానాల్లో అయినా జనసేన తరపున అభ్యర్థులను పోటీలో నిలబడితే.. ముందుగా బేస్ పెరుగుతుందని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో… టీడీపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ పార్టీకి చెందిన బలమైన నేతలందర్నీ.. నయానో .. భయారో.. టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న టీడీపీ ఇప్పుడు.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో తెలియడం లేదు. అలాగే.. వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. ఆ పార్టీని దాదాపుగా టీఆర్ఎస్‌లో విలీనం చేసినట్లే. ఇలాంటి సమయంలో… పవన్ కల్యాణ్.. సాహసోపేతంగా ముందడుగు వేస్తున్నట్లుగానే భావించాలి. వందల్లో ఉన్న జడ్పీటీసీల్లో కనీసం ఓ పది సాధించినా… జనసేన కు..తెలంగాణలో భవిష్యత్ ఉన్నట్లే భావించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close