ఉప్పల్ స్టేడియంలో రచ్చ..! యాంకర్ ప్రశాంతిపై కేసు..!

ఉప్పుల్ క్రికెట్ స్టేడియంలో.. స్నేహితులతో కలిసి యాంకర్ ప్రశాంతి మద్యం మత్తులో చేసిన రచ్చతో… పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం.. ఉప్పల్ స్టేడియంలో.. సన్ రైజర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగి… ప్రశాంతి వచ్చారు. వీరిలో ముగ్గురు మగవాళ్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. వీరు.. అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు.. కెమెరాల్లో రికార్డయ్యాయి. మద్యం మత్తులో వీరు చేస్తున్న పనులు.. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు.. ఇబ్బందులు కలిగించారు. ప్రశ్నించిన ప్రేక్షకులతో కూడా.. దురుసుగా ప్రవర్తించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యాంకర్ ప్రశాంతితో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రశాంతి పలు టీవీ చానళ్లలో యాంకరింగ్ చేశారు. సినీ సెలబ్రిటీస్‌ను ఇంటర్యూ చేసి పేరు తెచ్చుకున్నారు. గతంలో.. ఎఫైర్ అనే ఓ సినిమాలోనూ నటించారు. పూర్తిగా లెస్బియన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ చిక్కులో కూడా పడింది. గీతాంజలి అనే మరోనటితో కలిసి ప్రశాంతి.. ఈ సినిమాలో.. లెస్బియన్స్ గా నటించారు. సెన్సార్ కూడా ఆమోదించని సన్నివేశాలు ఉండటంతో.. సినిమాపై ఆసక్తికర చర్చ జరిగింది. ఎట్టకేలకు ఆ సినిమాను విడుదల చేసినప్పటికీ.. పెద్దగా సక్సెస్ కాలేదు.

యాంకర్ ప్రశాంతితో పాటు… ఆమె మిత్రబృందం.. వీఐపీ బాక్స్‌లో ఉన్నారు. వారికి… పాసులు.. కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చాయని చెబుతున్నారు. ఐపీఎల్ సీజన్‌లో… ఫ్రాంచైజీ జట్టుతో పాటు.. ఆ జట్టుతో సంబంధం ఉన్న వ్యాపారసంస్థలకు వీఐపీ పాసులు వస్తాయి. పైగా.. సన్ రైజర్స్ టీం.. జెమిని టీవీ యాజమాన్యానికి సంబంధించినది కావడంతో… ఆ కోణంలోనే వారికి వీఐపీ బాక్స్ టిక్కెట్లు అంది ఉంటాయని.. భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close