తెలుగు సినిమా బీసీసీఐ… దిల్ రాజు

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు దిల్ రాజు బీసీసీఐ లాంటి వార‌ని నాని చ‌మ‌త్క‌రించాడు. దానికో రీజ‌న్ ఉంది. ‘జెర్సీ’ సినిమాలో అర్జున్‌ని బీసీసీఐ స‌న్మానిస్తుంది. ఇప్పుడు జెర్సీ టీమ్‌ని దిల్ రాజు స‌న్మానించారు. అందుకే… ఈ మెచ్చుకోలు.

నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘జెర్సీ’. ఈసినిమా విడుద‌లై విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ‘జెర్సీ’ బృందాన్ని ప్ర‌త్యేకంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్రమం ఈరోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ “ఏ సినిమా చూసినా.. ఓ ప్ర‌శ్న న‌న్ను వెంటాడుతుంటుంది. ఓ ఐదేళ్ల‌కో ప‌దేళ్ల‌కో ఈ సినిమా పాతబ‌డిపోతుందా? ఆ జ‌న‌రేష‌న్‌కి ఈ సినిమా న‌చ్చుతుందా? అని ఆలోచించేవాడ్ని. కానీ ‘జెర్సీ’ అలా కాదు. ఈ హాలు, ఈ కెమెరాలు మ‌న‌మంతా… పాత‌బ‌డిపోవొచ్చు. కానీ ‘జెర్సీ’ సినిమా మాత్రం పాత‌ప‌డిపోదు” అని ఎమోష‌న‌ల్‌గా చెప్పాడు.

ఈ సినిమాని నాని పారితోషికం తీసుకోకుండా ప‌నిచేశాడ‌ని దిల్‌రాజు అభినందించారు. ఈ క‌థ విని.. నాకు పారితోషికం వ‌ద్దు, లాభాల్లో వాటా ఇవ్వండి చాలు… అని నాని నిర్మాత‌ల్ని కోరాడ‌ట‌. ఓ మంచి క‌థ కోసం నాని చేసిన ఈ ప్ర‌య‌త్నం నాకు న‌చ్చింది, ఈ విష‌యం తెలియ‌గానే క‌ళ్ల‌వెంబ‌డి నీళ్లొచ్చాయి… అని గుర్తు చేసుకున్నారు దిల్‌రాజు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close