రాజయ్యకి ఒక న్యాయం ,జగదీశ్వర రెడ్డి కి ఒక న్యాయమా : మంద కృష్ణ

గతంలో స్వైన్ ఫ్లూ కారణంగా ముగ్గురు చనిపోతే, దానిని కారణంగా చూపించి దళితుడైన రాజయ్య ని మంత్రి పదవి నుంచి తప్పించిన కేసీఆర్.. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యా శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి ని ఎందుకు పదవి నుండి తప్పించరని ప్రశ్నించారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.

ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి స్పందించిన మందకృష్ణ పలు ప్రశ్నలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంధించాడు. రాజయ్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు స్వైన్ ఫ్లూ కారణంగా చనిపోతే అప్పటికప్పుడు దళితుడైన రాజయ్య ని కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించాడని, కానీ అదే స్వైన్ ఫ్లూ కారణంగా రాజయ్య మంత్రి పదవి నుండి దిగిపోయిన తరువాత మరొక 15 మంది చనిపోతే ఒక అధికారి మీద కానీ ఒక్క మంత్రి మీద కానీ ఎటువంటి చర్య కేసీఆర్ తీసుకోలేదని మందకృష్ణ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా జగదీశ్వరరెడ్డి స్థానంలో ఎవరైనా దళితుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా వారి మీద కేసీఆర్ కత్తి వేటు పడి ఉండేదని, ఈ పాటికి మంత్రి పదవి పోయి ఉండేదని, కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి కావడం వల్ల ఎటువంటి చర్యలు లేవని మందకృష్ణ వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా తప్పు అంతటిని ఇంటర్ బోర్డు మీదకు నెట్టేసి మంత్రివర్యుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close