అప్పట్లానే ఈ సారి..! రాహుల్‌కు చంద్రబాబు చెప్పిన జోస్యం..!

రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ వర్గాలు ఓ రిపోర్ట్‌ను మీడియాకు లీక్ చేశాయి. అది… ఈ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నదాని చంద్రబాబు అంచనా పేరుతో.. మీడియాకు ఇచ్చారు. దీని ప్రకారం.. మే 23వ తేదీన .. హంగ్ పార్లమెంట్ ఖాయమనేది… టీడీపీ అధినేత అంచనా. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమనేది… అంచనా.

మిత్రపక్షాలతోనూ బీజేపీకి అధికారం కల్ల..!

టీడీపీ అధినేత అంచనా ప్రకారం… భారతీయ జనతా పార్టీకి.. పార్లమెంట్ సీట్లు వంద వరకు తగ్గవచ్చు. ఒడిషా, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కొంత మేర పుంజుకున్నప్పటికీ.. హిందీ రాష్ట్రాల్లో …పలుకుబడి కోల్పోవడం .. గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో స్వీప్ చేసిన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో..గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయడం సాధ్యం కానీ పరిస్థితి వల్ల.. బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్న అంచనాను..చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీ 42 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గత ఎన్నికల్లో స్వీప్ చేసిన గుజరాత్‌లో పది సీట్లు, మధ్యప్రదేశ్‌లో పన్నెండు సీట్లు, రాజస్థాన్ లో పది సీట్లు, గుజరాత్‌లో పది సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. ఒడిషాలో గత ఎన్నికల్లో బీజేపీ ఒకటి గెలిస్తే.. ఈ సారి ఆరు, బెంగాల్‌లో గత ఎన్నికల్లో బీజేపీ రెండు గెలిస్తే.. ఈ సారి ఐదు చోట్ల గెలిచి సీట్లు పెంచుకోనుంది. కానీ.. కోల్పోయే సీట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. అందుకే.. మొత్తంగా..బీజేపీ వంద సీట్లు అటూఇటుగా కోల్పోయి 179 దగ్గరే నిలబడిపోవచ్చనేది..చంద్రబాబు అంచనా.

కాంగ్రెస్‌కూ కష్టమే..! మద్దతు పొందడమో.. మద్దతివ్వడమో చేయాలి..!

చంద్రబాబు అంచనా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కాస్తంత పుంజుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునేంతగా.. బలపడలేదు. కనీసం అతి పెద్ద పార్టీగా అవతరించేంతగా కూడా.. బలపడలేదు. అయితే గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. ఈ సారి ఉనికిని చాటుకుంటుంది. ఫలితంగా ఆ పార్టీ బీజేపీ కన్నా..దాదాపుగా యాభై సీట్లు వెనుకబడి.. 129 సీట్ల దగ్గర ఆగిపోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా… ఇతర పార్టీలన్నీ 234 సీట్లు సాధించే అవకాశం ఉంది.ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బీహార్, మహారాష్ట్ర,బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో స్థానిక పార్టీలే కీలకం కానున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీలకు అత్యధిక సీట్లు దక్కుతాయి. వీటిలో బీజేపీ వైపు చూసే పార్టీలు సాధించే సీట్లు 30 నుంచి 40 మాత్రమే. మిగతావన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలే.

ఏపీలో వైసీపీకి ఎనిమిది ఎంపీ సీట్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. బూత్‌ల వారీగా పరిశీలన జరిపిన.. టీడీపీ అధినేత .. ఏపీలో పరిస్థితిపై కూడా అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లోలానే ఈ సారి కూడా… ఏపీలో ఫలితాలొస్తాయని టీడీపీకి పదిహేడు ఎంపీ సీట్లు, వైసీపీకి ఎనిమిది రావొచ్చనేది టీడీపీ అధినేత అంచనా. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన రెండు ఎంపీ సీట్లతో కలిసి.. టీడీపీ కూటమికి పదిహేడు వచ్చాయి. ఈ సారి కూడా అదే రిపీట్ అవనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close