అరాచకత్వం ప్రబలకుండా అందరూ ఒక్కటౌతున్నారు!

భాగ్యనగరంలో మజ్లిస్‌ పార్టీ అరాచకత్వం ప్రబలిపోకుండా ఇన్నాళ్లకు అన్ని పార్టీలూ ఒక్కతాటి మీదకు రావడానికి, నిర్దిష్టమైన కార్యాచరణతో మజ్లిస్‌ ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నానికి పూనుకోవడం ఇప్పుడు జరుగుతున్నది. మజ్లిస్‌ పార్టీకి చెందిన గూండాలు సాక్షాత్తూ శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌ ఆలీని దారుణంగా కొట్టడం, సాక్షాత్తూ మజ్లిస్‌ ఎమ్మెల్యే ఏకంగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఇంటిమీద దాడిచేసి ఆయన కొడుకును చితక్కొట్టడం, ఇంకా ఇతరత్రా జరిగిన అనేక దాడులు పాతబస్తీలో ప్రబులుతున్న అరాచకత్వానికి నిదర్శనాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే.. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం మీదికి రావడానికి ప్రతిసారీ కొన్ని డివిజన్లను గెలుచుకుంటూ ఉండే ఎంఐఎం మీద ఆధారపడడం అనేది పెద్ద పార్టీలకు గత్యంతరం లేని స్థితిగా మారుతోంది. అందుకే పార్టీలన్నీ వారి ఆగడాల్ని చూసీ చూడనట్లుగా వెళుతుండడం సాధారణంగా జరుగుతోంది.

అయితే ఈసారి మజ్లిస్‌ ఆగడాలు శృతి మించాయనే చెప్పాలి. ఎందుకంటే.. మజ్లిస్‌ మా మిత్రపక్షమే.. అని తెరాస అధినేత చెబుతూ ఉన్నప్పటికీ.. అదే పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కొడుకునే చితక్కొట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను చితక్కొట్టారు. ఇంత దారుణమైన ఆగడాలకు పాల్పడడంపై పీసీసీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నది.

కనీసం ఎంఐఎం ఎప్పుడో ఒకసారి తమకు ఉపయోగపడుతుంది అనే ఆశలను పక్కన పెట్టి.. ఇప్పుడు అన్ని పార్టీలూ ఎంఐఎం ఆగడాలకు బలవుతున్నాయి కాబట్టి.. అందరూ కలిసి ఐక్యంగా వారికి చెక్‌ పెట్టడానికి కార్యచరణ చర్చించుకోడానికి సమావేశం అవుతున్నారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి, అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి గులాబీ పార్టీ కూడా తోడ్పాటు అందిస్తుందా లేదా అనేది సందేహం. కాంగ్రెస్‌ పార్టీ అందరినీ పోగేస్తున్న ఈఅఖిల పక్షసమావేశానికి తెరాస దూరంగా ఉంటే మాత్రం నగరాన్ని మజ్లిస్‌ ఆగడాలనుంచి రక్షించే ఉద్దేశం వారికి లేనేలేదని, చెప్పినవన్నీ మెరమెచ్చు మాటలేనని అనుకోవాల్సి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close