మళ్లీ రంగంలోకి దిగుతున్న ఎమ్‌.ఎస్‌.రాజు

తెలుగు చిత్ర‌సీమ‌కు ఎన్నో సూప‌ర్ హిట్లు అందించారు ఎం.ఎస్‌.రాజు. నిర్మాత‌గానే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌గానూ ఆయ‌న సుప్ర‌సిద్ధుడే. ఆ త‌ర‌వాత మెగాఫోన్ ప‌ట్టారు. ఎప్పుడైతే డైరెక్ష‌న్ వైపు చూపు మ‌ళ్లిందో అప్పుడే.. నిర్మాత‌గానూ ఫామ్ కోల్పోయారు. త‌న‌యుడుని హీరోగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఆస్తుల్ని కూడా అమ్ముకోవాల్సివ‌చ్చింది. కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్నారాయ‌న‌. ఇప్పుడు మ‌ళ్లీ… రంగంలోకి దిగుతున్నారు.

విశ్వ‌క్ నేన్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రాన్ని రూపొందించ‌డానికి ఆయ‌న రెడీ అయ్యారు. న‌గ‌రానికి ఏమైంది? సినిమాతో ఆక‌ట్టుకున్నాడు విశ్వ‌క్ సేన్‌. ఇప్పుడు తానే ద‌ర్శ‌కుడిగా మారి ఫ‌ల‌క్ నామా దాస్‌ని రూపొందిస్తున్నాడు. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌చార చిత్రాల‌తో ఈ సినిమాపై కాస్తో కూస్తో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అందుకే ఎమ్‌.ఎస్‌.రాజు.. ఈ యువ హీరోకి అడ్వాన్సు ఇచ్చాడు. ఈసారి ఎం.ఎస్.రాజు నిర్మాత‌గానే ప‌రిమితం అవుతారా? లేదంటే ర‌చ‌యిత‌గానూ ప‌నిచేస్తారా? అనేది చూడాలి. ఈ సినిమాతో ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఇంత‌కాలం త‌న‌యుడిపైనే బెట్టింగ్ కాసిన రాజుగారు.. ఈసారి మ‌రో హీరోతో ప్ర‌యాణం చేయ‌డానికి రెడీ అయ్యారన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close