రాఘ‌వేంద్రుడి ‘చిత్ర‌మైన’ సినిమా

న‌మో వేంక‌టేశాయ త‌ర‌వాత సినిమాల‌వైపు దృష్టిసారించ‌లేదు కె.రాఘ‌వేంద్ర‌రావు. అదే ఆయ‌న చివ‌రి చిత్ర‌మ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే… త‌న ప్ర‌యాణాన్ని ఫ్లాప్ సినిమాతో ముగించాల‌ని అనుకోవట్లేదాయ‌న‌. మ‌రో హిట్ తీసి… దిగ్విజ‌యంగా ద‌ర్శ‌కుడిగా రిటైర్‌మెంట్ తీసుకోవాల‌నుకుంటున్నారు. అందుకే కొన్ని క‌థ‌ల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్ట‌కేల‌కు ఓ క‌థ ఖాయ‌మైంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాలో కొన్ని విచిత్ర‌మైన కాంబినేష‌న్లు క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అదేమిట‌న్న‌ది చిత్ర‌బృందమే ప్ర‌క‌టించాల్సివుంది. ఈ చిత్రాన్ని బాహుబ‌లి నిర్మాత‌లు తెర‌కెక్కించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈనెల 23న రాఘ‌వేంద్ర‌రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి. ఆ విచిత్ర‌మైన కాంబినేష‌న్ ఏమిటో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close