తెరపైకి పులివెందుల కాల్‌మనీ కేసు..!

టీడీపీ హయాంలో… విజయవాడలో కాల్‌మనీ కేసు కలకలం రేపింది. దీని ఆధారంగా.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి.. అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా.. చేసిన ఎస్పీల సమీక్షలోనూ.. ఇదే కేసుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా.. కాల్‌మనీ కేసు బయటపడింది. ఈ సారి కాల్‌మనీ వ్యాపారులు.. పులివెందుల వాసులే. బాధితుడు… మాత్రం.. సామాన్యుడు కాదు. మాజీ ఎమ్మెల్యే. అదీ కూడా.. గతంలో వైఎస్ ప్రాపకంతో ఎమ్మెల్యే అయిన నేత.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2004-2009 వరకు అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యేకా ఉన్న జొన్నా రామయ్య.. నిన్న తన ప్రాణానికి పులివెందుల వడ్డీ వ్యాపారుల నుంచి ప్రాణహానీ ఉందని.. ఫిర్యాదు చేశారు. చాలా కొద్ది మొత్తం అప్పు ఇచ్చి.. ఇప్పటికీ పులివెందుల వడ్డీ వ్యాపారులు తన వద్ద నుంచి రూ. పది కోట్లు వసూలు చేశారని.. ఇంకా అప్పు అలాగే ఉందని.. వేధిస్తున్నారని… కన్నీటి పర్యంతమయ్యారు. వారి బారినుంచి తనను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డిని, పోలీసులను, మీడియాను వేడుకున్నారు. తన ఆస్తులన్నీ లాగేసుకున్నారని.. తనకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదని.. అయినప్పటికీ వేధిస్తున్నారని.. ఆవేదన చెందుతున్నారు.

నిజానికి కదిరిలో చాలా కాలంగా పులివెందుల ప్రాబల్యమే ఉంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారులు కదిరిలో వడ్డీలకు ఇస్తూంటారు. అయితే అవన్నీ.. కాల్ మనీ తరహా వ్యాపారాలే. అధిక వడ్డీలు వసూలు చేస్తారు. ఇవ్వకపోతే.. ఏం చేయడానికైనా వెనుకాడరు. రాజకీయంగానూ.. వారు కదిరిలో పట్టు సాధించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కూడా పులివెందుల ప్రాంతానికి చెందినవారనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం.. ఈ పులివెందుల కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు భరించలేక… ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విజయవాడ కాల్‌మనీ కేసులపై అంతగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి.. ఓ మాజీ ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్న ఆవేదనను పట్టించుకుంటారో లేదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close