టీఆర్ఎస్ ఎంపీలకు బీజేపీ బంపర్ ఆఫర్లు..!?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో… బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. టీఆర్ఎస్‌లో అంతర్గత రాజకీయాల్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. రెండు రోజుల క్రితం టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత ,రామ‌గుండం మాజీ ఎమ్మెల్యే సోమార‌పు స‌త్యనారాయ‌ణతో పాటు పలువురు కార్పోరేట‌ర్లు క‌మ‌లం గూటికి చేర‌ారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ అమిత్ షాను కలవటం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో.. నలుగురు ఎంపీలు… బీజేపీలోకి వెళ్లబోతున్నారనే చర్చ తెలంగాణలో ప్రారంభమయింది.

న‌లుగురు టీఆర్ఎస్ ఎంపీలు త‌మ‌కు ట‌చ్ లో ఉన్నారంటూ బీజేపీ సీనియ‌ర్ నేత బండారు ద‌త్తా త్రేయ‌తో పాటు.. ఇత‌ర నేతలు ప‌దేప‌దే మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ టీఆర్ ఎస్ లో అల‌జ‌డి రేపుతున్నాయి. నిజంగానే ఎంపీలు బీజేపీకి ట‌చ్ లో ఉన్నారా.. లేక బీజేపీ ఆడుతున్న మైండ్ గేమా అన్న చ‌ర్చ మొద‌లైంది. టిఆర్ఎస్ లో గెలిచినవారు కొంతమంది కొత్త వారు. ఎన్నిక‌ల ముందే టీఆర్ఎస్ లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో వారు బిజెపి వైపు చూస్తున్నారనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్‌లో ఉన్న వ్యాపారవేత్తలపై అందరి దృష్టి పడింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు… వ్యాపార ప్రయోజనాల కోణంలోనే బీజేపీలో చేరారని నమ్ముతున్న టీఆర్ఎస్ నేతలు… తమ ఎంపీ వ్యాపారవేత్తలపై కన్నేశారు.

టిఆర్ఎస్ లో బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి , నామా నాగేశ్వరరావు లాంటి బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం కరుణాకటాక్షలు కచ్చితంగా కావాలి. లేకపోయినా పర్వాలేదు.. ఆగ్రహానికి మాత్రం గురి కాకూడదు. టీఆర్ఎస్ పై ఇప్పుడు బీజేపీ మరో విధంగా ఆలోచిస్తోంది. అందుకే వీరు ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. దీన్నే బీజేపీ.. పక్కాగా ఉపయోగించుకుంటోంది. బిజెపి ప్రయత్నాలపై గులాబీ పార్టీ ముఖ్య నేతలు సైతం ఆరా తీస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close