కృష్ణంరాజుకు మళ్ళీ మొండి చేయి

బిజెపి అధిష్టానం బిజెపి నేత కృష్ణంరాజు కి మళ్లీ మొండిచేయి చూపింది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం, ఎప్పటినుండో గవర్నర్ పదవిని ఆశిస్తున్న కృష్ణం రాజు కు మాత్రం ఆశాభంగం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

పలు రాష్ట్రాల కి గవర్నర్ లని నియమిస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీ టాండన్, బీహార్ గవర్నర్గా ఫాగు చౌహాన్, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా ఆనంది బెన్ పటేల్, త్రిపుర గవర్నర్గా రమేష్ బయాస్, నాగాలాండ్ గవర్నర్గా రవి లని బిజెపి నియమించింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒరిస్సాకి చెందిన సీనియర్ బిజెపి నేత బిశ్వ భూషణ్ ని గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.

అయితే మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు, 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత బిజెపికి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. అయితే ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో చేరి తాను చారిత్రక తప్పిదం చేశానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు వైఎస్ జగన్ కి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, అధికారికంగా వైఎస్ఆర్సిపిలో కృష్ణంరాజు చేరతారేమో అన్న ఊహాగానాలు వచ్చినప్పటికీ, 2014 మోడీ హయాంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణంరాజు తిరిగి తన సొంత గూటికి చేరిపోయారు. అయితే పార్టీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్న విద్యాసాగరరావు లాంటి నేతలకు గవర్నర్ పదవి లభించినప్పటికీ, తిరిగి చేరిన కృష్ణంరాజు కు బిజెపి తరఫున పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అయితే కృష్ణంరాజు మాత్రం తాను బీజేపీలో నే ఉంటా అని, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను బిజెపిని వీడనని, అయితే గవర్నర్ పదవి ఇస్తే మాత్రం తప్పకుండా ఆ బాధ్యతను స్వీకరిస్తానని బాహాటంగా వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా ప్రస్తుతం చేసిన నియామకాల్లో కృష్ణంరాజు పేరు ఎక్కడా కనిపించకపోవడంతో, గవర్నర్ కావాలన్న ఆయన ఆశ ప్రస్తుతానికి మాత్రం అడియాసే అని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close