సుకుమార్ కు సురేందర్ బ్రేక్?

సురేందర్ రెడ్డి. ఓ హిట్టు..ఓ ఫ్లాపు అంటూ సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీలో పెద్ద డైరక్టర్ల జాబితాలో చోటు తెచ్చుకున్న డైరక్టర్. ప్రస్తుతం చేస్తున్న సినిమా మెగాస్టార్ సైరా. అక్టోబర్ 2న విడుదలకు రెడీ అయిపోతోంది. తరువాత ఏంటీ? అన్నది క్వశ్చను.

పెద్ద డైరక్టర్లు అంతా తలా హీరో లకు లైన్ లు చెప్పి, క్యూలో వున్నారు. మరి సురేందర్ రెడ్డి సంగతేమిటి? సైరా తరువాత కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, మరో ఆరు నెలల్లో ఏదో సినిమా స్టార్ట్ చేయాలి. అదే..ఎవరితో? అన్నది క్వశ్చను. సురేందర్ రెడ్డికి మహేష్ బాబుతో సినిమా చేయాలని వుంది అని తెలుస్తోంది.

అయితే సురేందర్ రెడ్డితో బన్నీ సినిమా చేయించే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. కానీ ఇద్దరు హీరోలు ఖాళీ లేరు. మహేష్ ముందు రెండు కమిట్ మెంట్ లు వున్నాయి. బన్నీ ముందు రెండు కమిట్ మెంట్ లు వున్నాయి. మహేష్ దగ్గర అయినా, బన్నీ దగ్గర అయిన ఫుల్ గా ఫైనల్ కాని కమిట్ మెంట్ అంటే సుకుమార్ దే. సైరా హిట్ అయి, సురేందర్ మంచి లైన్ చెబితే ఇటు మహేష్ దగ్గర అయినా, బన్నీ దగ్గర అయినా బ్రేక్ పడేది సుకుమార్ సినిమాకే.

అందుకే ముందు జాగ్రత్తగా బన్నీ దగ్గర సినిమా ఓపెన్ అయిపోయి లైన్ లో వుంది అనిపించుకునే ప్రయత్నాల్లో సుకుమార్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నారట.
ఆ ప్రయత్నాలు ఫలిస్తే అక్టోబర్ లో ఓపెనింగ్ వుండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close