ఈడీ ఆఫీసుకొచ్చి హెచ్చరించి వెళ్లాడట..! దటీజ్ గాలి..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృస్తియించిన ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి ఈడీ అధికారులు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విదేశాలకు తరలించిన వేల కోట్ల ధనం గురించి లెక్కలు చెప్పాలని.. ఆదేశించడంతో… ఆయన వచ్చినట్లు… ఈడీ వర్గాలు చెప్పాయి. కానీ ఆయన మాత్రం.. తానే.. ఈడీ అధికారుల సంగతి తేల్చడానికి వచ్చినట్లుగా మీడియాకు చెప్పుకున్నారు. కర్ణాటక , ఆంద్ర ప్రదేశ్ లో ఓబులాపురం మైనింగ్ కేసు పెను సంచలనం సృష్టించింది. జూన్ 21 2007 లో అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారన్న ఆరోపణలుతో సీబీఐ కేసు నమోదు చేసింది. 2007-09 మద్య లో ఫెమా చట్టాన్ని ఉల్లంఘంచి రూ. వేల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ తో పాటు నిర్వాహకులు గాలి జనార్ధన్ రెడ్డి , అతని సతీమణి లక్ష్మి అరుణలకు నోటిసులు ఇచ్చారు.

నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా.. వేల కోట్ల ధనాన్ని దేశం దాటించారని ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో 121B, 420,411,471,పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఈడీ ముందు గాలి జనార్ధన్ రెడ్డి విచారణ కి హాజరయ్యారు .. విదేశాలకు తరలించిన నగదు లావాదేవీల వివరాలతో పాటు తన ఆస్తులు గురించి జనార్థన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. అన్ని పత్రాలు తో సహా ఈడీ విచారణ కి హాజరైన గాలిని ఆరు గంటలు పాటు ప్రశ్నించారు. కానీ విచారణ తర్వతా బయటకు వచ్చిన గాలి…జప్తు చేసిన తన ఆస్తులను ఇవ్వాలని ఈడీ అధికారులను అడగడటానికి వచ్చినట్లు చెప్పుకున్నారు. ఈడీకి సంబంధించిన కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిందని ప్రకటించుకున్నారు.

ఈడీ అటాచ్ చేసిన ఆస్తిపాస్తులను వెనక్కి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు కూడా చెప్పుకొచ్చారు. తిరిగివ్వకపోతే.. కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తానని కూడా గాలి జనార్దన్ రెడ్డి మీడియా ముందు ఈడీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈడీ ఆధీనంలో రూ. వెయ్యి కోట్లకు పైగా తన ఆస్తులు ఉన్నాయని గాలి జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఈడీ అధికారుల వద్దకు గాలి జనార్ధన్ రెడ్డి వచ్చిన హంగు.. ఆర్భాటం.. మామూలుగా లేదు. ఖరీదైన కార్ల కాన్వాయ్‌లో ఆయన వచ్చారు. కర్ణాటక పోలీసుల ప్రొటెక్షన్ కూడా తెచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close