ఊహించినట్టే కర్ణాటకం క్లైమాక్స్..! ఇక కుమారస్వామి మాజీ..!

కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు కాలం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిహేను మంది రెబల్స్.. అసెంబ్లీకి హాజరు కాకుండా డుమ్మాకొట్టడంతో.. కుమారస్వామి సర్కార్ పరాజయం పాలయింది. అసెంబ్లీలో ఉన్న సభ్యుల ప్రకారం.. కావాల్సిన మ్యాజిక్ మార్క్ ను.. అందుకోవడంలో.. కుమారస్వామి విఫలమయ్యారు. ఎన్ని రోజులు అవకాశం దొరికినా కనీసం ముగ్గురు, నలుగురు రెబల్స్ ను కూడా బుజ్జగించడంలో… కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. ఫలితంగా.. కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు.

కర్ణాకట అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా 16 మంది రాజీనామా చేసి..సభకు రాకుండా ఉండిపోయారు. సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 105. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 80 కాగా, 13మంది రాజీనామా చేశారు. ఇద్దరు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. జేడీఎస్‌ సభ్యుల సంఖ్య 37 కాగా, ముగ్గురు రాజీనామాలు సమర్పించారు. వీరు ఓటింగ్ కు హాజరు కాలేదు. బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతివ్వడంతో సంకీర్ణ కూటమి సంఖ్యాబలం 99 దగ్గరే ఆగిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ఫలితంగా.. సర్కార్ కూలిపోయిది.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ చివరి వరకూ ప్రయత్నాలు చేశాయి. స్పీకర్ విశేష అధికారాలను ఉపయోగించి బలపరీక్షను పలుమార్లు వాయిదా వేసినప్పటికీ…మద్దతు కూడగట్టుకోలేకపోయారు. సంకీర్ణ సర్కార్ మే- 23, 2018, కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విపక్షాల ఐక్యతా వేదికగా నిలిచిన అ ప్రమాణస్వీకారం..దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని అనుకున్నారు. కానీ విపక్షాల ఐక్యతలాగే.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం మధ్య పొసగలేదు. పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.. కాంగ్రెస్ – జేడీఎస్ నేతల మధ్య పొసగని వ్యవహారం.. బీజేపీకి పండుగలా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close