పీపీఏలు సమీక్షిస్తే “ఎన్‌పీఎ”లు అవుతాయంటున్న క్రిసిల్..!

రుణం ఇచ్చే వారికి…. తీసుకునేవారిపై… ఒక్క శాతం అపనమ్మకం ఏర్పడినా… రూపాయి కూడా అప్పు పుట్టదు. ఎందుకంటే.. రుణం ఇచ్చే వారు.. దాన్ని డిఫాల్ట్‌గా మార్చుకోవాలనో.. మారిపోవాలనో కోరుకోరు. అలాంటి చాన్సులు ఉన్నా… తమ రుణం ఉత్పాదక వ్యయానికి కాకుండా.. ఇతర అసరాలకు ఖర్చు పెడుతున్నారని తెలిసినా.. వారు వెనక్కి తగ్గుతారు. ఇలాంటి రిస్క్‌లను అంచనా వేసే రేటింగ్ సంస్థ ” క్రిసిల్ ” .. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల సమీక్షల విషయంలో కీలకమైన ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న పీపీఏ సమీక్షలతో.. పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతాయని క్రిసిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతాయని ప్రకటించారు.

ప్రస్తుతం ఈ కంపెనీలు దాదాపు 21వేల కోట్ల రూపాయల వరకు రుణాలు సమీకరించాయని… పీపీఏలను ఏపీ సర్కార్ రద్దు చేస్తే.. ఆ రుణాలన్నీ ఎన్‌పీఏలుగా మారిపోయే ప్రమాదం ఉందని క్రిసిల్ అంచనా. విషయం కోర్టుకు వెళ్తే.. ఇప్పుడల్లా పరిష్కారం అయ్యే ప్రమాదం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. ఓ రకంగా.. క్రిసిల్ లేఖ.. రుణ వితరణ సంస్థలకు ఒక హెచ్చరిక లాంటిదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. భారీ పెట్టుబడులతో… పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. రాజకీయ కారణాలతో రిస్క్‌లో పెట్టుకుని.. మొత్తానికే తేడా తెచ్చుకోవడం ఎందుకున్న భావన… ఆ లేఖతో పారిశ్రామికవేత్తల్లో ప్రారంభమవుతుందంటున్నారు. పారిశ్రామిక రంగాల్లో.. రేటింగ్ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. వాటి సూచనలు, సలహాలు.. అత్యంత ప్రభావితంగా ఉంటాయి. వాటి రేటింగ్‌లు బాగా ఉంటే.. రుణాలు కూడా వస్తాయి. లేకపోతే.. రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలూ.. వెనుకడుగు వేస్తాయి.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రిసిల్ కొన్ని సూచనలు చేసింది. పునరుత్పాదక విద్యుత్తు రంగాన్ని పెద్దఎత్తున ప్రభావితం చేసే అంశాలను పరిగణనలోకి తీసుకుని… దీనిపై తగిన విధంగా ముందుకెళ్లాలని సూచించింది. లేకపోతే పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వమే రెండు సార్లు లేఖలు రాస్తే.. పట్టించుకోని ఏపీ సర్కార్.. క్రిసిల్ … లేఖను మాత్రం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందన్న అంచనాలు సహజంగానే ప్రజల్లో వస్తాయి. మరి ప్రభుత్వం ఏం చేయనుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close