సోమవారం కర్ణాటకం పార్ట్ -2

యడ్యూరప్పగా కలిసి రాలేదని.. యడియూరప్పగా పేరు మార్చుకుని.. బీజేపీ నేత .. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాలుగో సారి సీఎం అయ్యారు. అయితే. . అంతకు ముందు మూడు సార్లూ కలిపి ఆయన ఐదేళ్లు అధికారం చెలాయించలేకపోయారు. నాలుగోసారి అవకాశం లేదు. ఇక నుంచి పూర్తిగా ఉన్నా… అది నాలుగేళ్ల లోపే అవుతుంది. అయితే పూర్తి కాలం ఉంటారా.. అంటే.. అంత తేలికగా రాజకీయం లేదన్న అభిప్రాయం కర్ణాటకలో జోరుగా వినిపిస్తోంది. కర్ణాటకలో ఏ రోజు ఎవరు ఎటు మారతారో తెలియని పరిస్థితి. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం, సభకు హాజరు కావాలా వద్దా అన్నది వారి ఇష్టానికే వదలేసింది. ఇప్పటి వరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అమలులో ఉన్నాయి.

విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు తుది తీర్పు కీలకం కాబోతోంది. స్పీకర్ రమేష్ కుమార్ ఇప్పటికే ముగ్గురు రెబెల్స్‌ను అనర్హులుగా ప్రకటించారు. మరో 15 మంది భవితవ్యం ఆయన చేతుల్లో ఉంది. పార్టీలకు విప్ అధికారం ఉంటుందని… సుప్రీం కోర్టు తన తుది తీర్పులో ప్రకటిస్తే… మిగతా రెబెల్స్ రాజకీయ జీవితంపై తెర పడినట్లే. అప్పుడు ఎమ్మెల్యేలు కాకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలన్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతంది. యడియూరప్ప ప్రభుత్వం బల నిరూపణ పూర్తయ్యే వరకు తాము బెంగళూరు దరిదాపులకు రాబోమని, ముంబైలోనే ఉంటామని రెబెల్స్.. అమిత్ షాకు హామీ ఇచ్చారు. దానితో అంతా సవ్యంగానే జరుగుతుందని అమిత్ షా నమ్మి… యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి అనుమతి ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత కర్ణాటక అసెంబ్లీ బలం 221కి పడిపోయింది. బల నిరూపణ జరిగితే 111 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. బీజేపీకి 105 మంది సభ్యులున్నారు.

రెండు పార్టీల మధ్య ఉన్న ఐదు ఓట్ల తేడా ఏ క్షణమైనా మారవచ్చని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. కాంగ్రెస్ అసంతృప్తుల్ని ఎలా బీజేపీ చేరదీసిందో.. బీజేపీ అసంతృప్తుల్ని అలా చేరదీయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అనర్హతా వేటో.. రాజీనామాలు ఆమోదించడమో.. ఏదో ఒకటి.. ఎమ్మెల్యే స్థానాలు మాత్రం ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కూడా కాంగ్రెస్ – జేడీఎస్ ఆశిస్తోంది. ఖాళీ అయిన స్థానాల్లో జరిగే ఎన్నికల్లో తమ సంకీర్ణం విజయం సాధించగలిగితే… యడియూరప్ప సర్కారు మళ్లీ మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు పూర్తి కాలం పదవిలో ఉండకుండానే యడియూరప్పను దింపేయవచ్చు. మళ్లీ తమ సంకీర్ణం అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ – జేడీఎస్ ఇప్పుడు వ్యూహరచన చేస్తున్నాయి. మొత్తానికి కర్ణాటకం ముగిసే అవకాశం లేదని.. పార్ట్ -2 మాత్రమే ఉంటుందని.. ఇప్పటికైతే క్లారిటీగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close