నాగార్జునపై శ్వేతారెడ్డి బూతుపురాణం..!

బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై న్యాయపోరాటం చేస్తున్న టీవీ యాంకర్ శ్వేతారెడ్డి… తన పోరాటానికి ఫలితం రావాలనుకుంటున్నారో.. ప్రచారా కావాలనుకుంటున్నారో కానీ… హద్దులు దాటి పోయారు. ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి.. బిగ్ బాస్ హోస్ట్, స్టార్ హీరో నాగార్జునపై.. తిట్ల దండకం వినిపించారు. ఆ తిట్లు కూడా.. పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ లా లేవు. జంధ్యాల సినిమాల డైలాగ్స్‌లా.. కామెడీగా లేవు. మహిళలు కొళాయిల దగ్గర కొట్లాడుకుంటే.. ఎలాంటి తిట్లు వస్తాయో… అలాంటి తిట్లనే దండకంగా వినిపించారు. ఆమె భాష విని..మీడియా ప్రతినిధులు కూడా.. చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అన్యాయం జరుగుతోందని పోరాడుతూంటే..ఎందుకు స్పందించరని నాగార్జునను ప్రశ్నించారు. టాస్క్‌ల పేరిట కంటెస్టెంట్‌లను మానసికంగా హింసిస్తున్నారని.. మండిపడ్డారు. తాము చేస్తున్న పోరాటాన్నినీటి బుడగ అన్నారని.. మేం కాదు గాలి బుడగలం.. ఓయూ విద్యార్థులకు నాగార్జుననే ఓ గాలి బుడగ అని మండిపడ్డారు. అంతే కాదు. ఒక రోజు మీ భార్య అమలను కోడలు సమంతను బిగ్‌బాస్ హౌస్‌లో వుంచి డబ్బులు సంపాదించండి అని తీవ్రమైన విమర్శలు చేశారు. తప్పుచేయకుంటే బయటికి వచ్చి స్పందించాలి… నాగార్జున ఎందుకు దొంగలాగా దాక్కుంటున్నారని మండిపడ్డారు. నాగార్జున డబ్బులకు ఏమైనా చేస్తావా..?. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా ” అని చెలరేగిపోయారు.

బిగ్‌బాస్ టీవీ టీఆర్పీల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ కన్నా… నాగార్జున హోస్ట్ చేస్తున్న మూడో సీజన్ రేటింగ్స్ ఎక్కువగా ఉండటంతో ఆ షో టీవీ వ్యూయర్స్ ను ఎంత ఎక్కువగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి బిగ్‌బాస్ వ్యవహారం కోర్టులో ఉంది. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు వెళ్లారు.మా టీవీ ప్రతినిధులు కూడా కోర్టుకు వెళ్లారు. దానికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ జరుగుతోంది. అయితే శ్వేతారెడ్డి మాత్రం.. వారంలో రెండు మూడు రోజుల పాటు మీడియా సమావేశాలు పెట్టి.. విమర్శల ఘాటు పెంచుకుంటూ పోతున్నారు. అది తిట్ల స్థాయికి వచ్చింది. తర్వత ఏం చేస్తారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close