చైతన్య : టీటీడీ చైర్మన్ వ్యక్తి పూజ..! శ్రీవారి ప్రసాదానికి మహాపరాధం..!

ఒక్కటంటే.. ఒక్క క్షణం ఆ శ్రీనివాసుని దివ్య దర్శనం కోసం భక్తులు .. గంటలు గంటలు.. క్యూలో నిల్చుకుంటారు. ఆ దేవదేవుని ప్రసాదాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్లకు అద్దుకుని భక్తిభావంతో నోట్లో వేసుకుంటారు. ఏ శ్రీవారి భక్తుడూ.. ఆ ప్రసాదాన్ని కాళ్ల వద్ద పెట్టాలని కానీ.. కనీసం నేల మీద పెట్టాలన్న ఆలోచన కూడా రానీయడు. అలాంటి.. స్వామివారి సేవకే.. పరిమితమైన వారు.. అలాంటి పని చేయగలరా.. ? ప్రసాదాన్ని ఇతర వ్యక్తుల కాళ్ల వద్ద పెట్టగలరా..? లేక… ఇతర వ్యక్తులకు నైవేద్యంగా ఉంచగలరా..? శ్రీవారి సామాన్య భక్తులెవరూ అలాంటి పనులు చేయరు. కానీ టీటీడీ చైర్మన్ చేస్తారు. వైవీ సుబ్బారెడ్డి చేస్తారు. చేసి చూపించారు. ఇప్పుడీ వ్యవహారమే కలకలం రేపుతోంది.

శ్రీవారి ప్రసాదాన్ని కూడా చేత్తో అందుకోనంత ఎదిగిపోయారా స్వరూపానంద..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి .. ఆ పార్టీ అధినేతకు.. స్వరూపానంద స్వామి రాజగురువుగా మారిపోయారు. ఇప్పుడు.. చాలా మంది ప్రభుత్వంతో పని చేయించుకోవాలనుకుంటే.. సిఫార్సుల కోసం… ఆ స్వామిజీ దగ్గరకే వెళ్తున్నారు. అలాంటిది.. ఇక వైసీపీ నేతలు వెళ్లకుండా ఉంటారా..? పెద్ద ఎత్తున వైసీపీ నేతలు.. స్వరూపానందను దర్శించుకుని… సేవ చేసుకుని కానుకలు సమర్పించుకుని వస్తున్నారు. ఈ క్రమంలో.. నెలన్నర కిందటే.. టీటీడీ చైర్మన్ పదవి పొందిన వైవీ సుబ్బారెడ్డి కూడా.. ఆయన సేవకు వెళ్లారు. ఉత్తినే వెళ్లలేదు. తనకు వచ్చిన పదవితో… దక్కే అధికారంతో… దండిగా శ్రీవారి ప్రసాదాలను.. కూడా తీసుకెళ్లారు. స్వరూపానందకు సమర్పించుకున్నారు. అయితే… స్వరూపానంద శ్రీవారి ప్రసాదాన్ని చేత్తో తీసుకోలేదు. కింద పెట్టించారు. తన పీఠం నుంచి ఆయన కదల్లేదు. కింద పెట్టమని సూచించారు. వైవీ సుబ్బారెడ్డికి అలా పెట్టడం… శ్రీవారిని అవమానించడం అన్నట్లుగా అనిపించలేదు.. ఆయన కింద పెట్టేశారు.

మహాప్రసాదాన్ని కాళ్ల వద్ద, కింద పెట్టకూడదని టీటీడీ చైర్మన్‌కి ఎవరైనా చెప్పాలా..?

శ్రీవారి ప్రసాదాన్ని ప్రముఖులకు అందివ్వడం తప్పు కాదు. అందరూ అదే చేస్తారు. కానీ.. ఏ ఒక్కరయినా.. ఇంత వరకూ… ఆ ప్రసాదాన్ని చేత్తో తీసుకోకుండా.. కింద పెట్టించిన సందర్భాలు లేవు. అలా.. ప్రసాదం తీసుకెళ్లిన వాళ్లు… కాళ్ల దగ్గర పెట్టిన సందర్భాలు అసలు లేవు. ఎందుకంటే.. శ్రీవారి ప్రసాదం పరమ పవిత్రం. సాక్షిత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా .. అత్యంత భక్తి భావంతో… శ్రీవారి ప్రసాదాన్ని అందుకుంటారు. ఇక్కడ మాత్రం.. శ్రీవారి కన్నా.. తానే గొప్ప అని అనుకుంటున్నారేమో కానీ.. స్వరూపానంద మాత్రం… ఆ ప్రసాదాన్ని కూడా.. కింద పెట్టించేశారు.

స్వామి వారిని వదిలేసి వ్యక్తి పూజల్లో టీటీడీ చైర్మన్..!

స్వామి వారి సేవలో పునీతులు కావాల్సిన టీటీడీ చైర్మన్.. ఇలా వ్యక్తి పూజల కోసం.. ఊళ్లు పట్టుకు తిరగడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఆయన టీటీడీ చైర్మన్ హోదాలో.. పెద్దలను పరిచయడం చేసుకోవడానికి.. ఢిల్లీ వెళ్లారు. తానిప్పుడు.. టీటీడీ చైర్మన్‌నని చెప్పుకుని… కేంద్రంలోని చాలా మంది పెద్దలను కలిసి ప్రసాదాలు ఇచ్చి పరిచయాలు పెంచుకుని వచ్చారు. ఈ తర్వాత రుషికేష్ వెళ్లి మరీ స్వరూపానందను కలిశారు. స్వరూపానంద ఏడాదికి నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష పేరుతో రుషికేష్‌లో గడుపుతారు. ఆ సమయంలో… చాలా మందిని అక్కడికే పిలిపించుకుంటారు. మీడియా కవరేజీ వచ్చేలా చూసుకుంటారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి కూడా వెళ్లి సేవించి వచ్చారు. టీటీటీ చైర్మన్‌గా శ్రీవారికి.. ఆయన భక్తులకు… ఇప్పటి వరకూ.. ఎంత సేవ చేశారో కానీ.. ఆ పదవి పేరుతో మాత్రం.. వ్యక్తి పూజ మాత్రం వైవీసుబ్బారెడ్డి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close