పెళ్లి చేసుకుంటే రూ.లక్ష..! ఏపీ ప్రజలకు మరో రత్నం..!

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విషయంలో ఇప్పటి వరకూ ఓ లెక్క… రేపట్నుంచి టన్నుల్లెక్క ఉండనుంది. ప్రజలకు ఇసుకను టన్నును రూ. 375 అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఇక నుంచి ఏపీలో ఇసుక అమ్మకాలు ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారానే జరుగుతాయి. ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే… సరఫరా చేస్తారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాను నిషేధించారు. స్టాక్ యార్డులు సహా.. మొత్తం ఆన్ లైన్ విధానంలోనే ఇసుక పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. మంత్రి వర్గ సమావేశంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆశావర్కర్ల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు 10వేలకు పెరగనున్నాయి. నిజానికి తొలి కేబినెట్ భేటీలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అయినా మరోసారి ఆమోద ముద్ర వేశారు. ఆటోలు, ట్యాక్సీల ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు.. ఏడాదికి రూ.10 వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకాన్ని శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి తెస్తామని.. పెళ్లి రోజే నగదు చేతికి అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లి కానుక కింద లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లికి కూడా లక్ష ఇస్తాం ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. టీటీడీ బోర్డులోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సభ్యుల్ని.. ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ.. ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ ప్రకారం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సి ఉంది. కానీ కేంద్రం అనుమతి కావాల్సి ఉండటం, ఇతర కారణాల వల్ల ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో విలీనం సాధ్యం కాదని భావించడంతో .. ఇప్పటికి ఉద్యోగుల్ని విలీనం చేయనున్నారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచనున్నారు. మంత్రి వర్గం .. పలు రద్దు నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని తీర్మానం చేసింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close