ఇక టీడీపీ నుంచి ఏపీ పోలీసులకు హెచ్చరికలు..!

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పరస్థితి ఘోరంగా మారింది. ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తే.. ప్రతిపక్షానికి టార్గెట్ అవుతున్నారు. టీడీపీ హయంలో.. వైసీపీ నేతలు.. పోలీసులపై ఓ రేంజ్ లో ఫైరయ్యేవారు. అసలు పోలీసులపై నమ్మకం లేదని.. తెలంగాణ పోలీసులపై ఆధారపడేవారు. ఓ రకంగా.. పోలీసులంటే.. టీడీపీ నేతలన్నట్లుగానే వైసీపీ నేతలు భావించేవారు. వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి నుంచే ఆ తరహా ప్రవర్తనను వైసీపీ నేతలు అలవర్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారపక్షంలోకి వచ్చింది. ఇక పోలీసుల్ని నమ్మకపోవడానికి అవకాశం లేదు. కానీ.. ఇప్పుడు.. వైసీపీ ప్లేస్ లోకి టీడీపీ వచ్చింది. వారు.. పోలీసులపై విరుచుకు పడుతున్నారు.

పోలీసులు జాగ్రత్తగా…న్యాయంగా వ్యవహరించండని.. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో ఓపెన్ గానే హెచ్చరిక జారీ చేశారు. మూడేళ్ళలో ఎన్నికలు రాబోతున్నాయని .. మీరు మళ్ళీ మా దగ్గరే పని చేయాల్సి ఉందని…వార్నింగ్ గట్టిగానే పంపారు. హెల్మెట్లు లేవని ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని.. అయ్యన్న ఇలా ఫైరయ్యారు. తప్పు పోలీసులది కాదు ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి ఉందని తర్వాత కవర్ చేసుకున్నారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా… పోలీసులు స్పందించడం లేదని… పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తానని హెచ్చరిస్తున్నారు.

పోలీసులకు సొంత రాజకీయ అభిప్రాయాలు ఉన్నా.. ప్రభుత్వం చెప్పినట్లు చేయాల్సిందే. అలా చేసినందుకు..పలువురు పోలీసు అధికారులపై… వైసీపీ సర్కార్ రాగానే ప్రతీకారం తీర్చుకుంది. పలువురికి పోస్టింగులు నిరాకరించింది. అప్పట్లో వైసీపీ ఆగ్రహానికి చాలా మంది అధికారులు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. ప్రభుత్వాలు మారితే ముందుగా.. పోలీసులకే టెన్షన్ పట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close