దేవులపల్లి అమర్ ఫెయిల్యూర్ స్టోరీ..! నేషనల్ మీడియాలో అంతా నెగెటివ్ ప్రచారమే..!

జాతీయమీడియాలో ఏకపక్షంగా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు నెగెటివ్ గా… న్యూస్ వస్తుందని ఎవరూ ఉహించలేకపోయారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు.. జాతీయ మీడియాలో జగన్ కు మెరుగైన మద్దతు లభించింది. అప్పుడు ఎలాంటి సలహాదారులు లేరు. కానీ.. ఇటీవలే.. రూ. రెండు,మూడు లక్షలు నెలకు జీతం ఇచ్చి… ప్రత్యేకంగా.. అంతర్రాష్ట్ర, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్‌ను నియమించుకున్న తర్వాత… ఇలా జరగడం.. వైసీపీ నేతల్ని కూడా.. విస్మయపరుస్తోంది. ఆయన ..తన సలహాదారు పదవిలో మొదటే వైఫల్యం చెందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత… టీడీపీ క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు చేపట్టిన చలో ఆత్మకూరు దేశవ్యాప్త మీడియా దృష్టిని ఆకర్షించింది.

సాధారణంగా… ప్రాంతీయ పార్టీల రాజకీయ కార్యక్రమాలకు.. జాతీయ మీడియాలో పెద్దగా గుర్తింపు లభించదు. కనీస కవరేజీ కూడా.. దొరకదు. కానీ.. ఈ సారి.. తెలుగుదేశం చేపట్టిన..చలో ఆత్మకూర్ మాత్రం… మొదటి నుంచి.. నేషనల్ హెడ్ లైన్స్ లో నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని హౌస్ అరెస్ట్ చేయడం.. మొదటి బ్రేకింగ్ అయితే.. ఆ తర్వాత ప్రతీ దశలోనూ.. న్యూస్ జాతీయ స్థాయిలో హైలెట్ అయింది. అసలేం జరిగిందని..ఏపీలో పోలీసులు ఇంత హడావుడి చేస్తున్నారనే ఆసక్తి.. అంతటా ఏర్పడింది. గ్రామాల్లో పరిస్థితి ఏమిటన్నదానిపై… జాతీయ మీడియా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి. చంద్రబాబు వెళ్లాలనుకున్న ఆత్మకూరులోని పరిస్థితిని కూడా జాతీయ మీడియా చానళ్లు రిపోర్ట్ చేశాయంటే… పరిస్తితి ఎంత జాతీయ స్థాయిలో ఎంత ఆసక్తి కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకూ… కశ్మీర్ లో నేతల గృహనిర్బంధాల కథనాలు మాత్రమే.. జాతీయ మీడియా ఇచ్చింది.

ఆ స్థాయిలో.. ఏపీలో … టీడీపీ నేతల గృహనిర్బంధం.. జరగడం… బహుశా.. జాతీయ మీడియాకు ఆసక్తి కలిగించి ఉండవచ్చు. ఈ నిర్బంధాలు గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఉండటం …జాతీయ మీడియాకు సైతం.. న్యూస్ గా మారింది. ఓ మహా ఉద్యమం ఏదో జరగబోతోందన్నట్లుగా.. టీడీపీలో ఓ స్థాయి నేతల దగ్గర్నుంచి చోటా,మోటా నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం… అందర్నీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు బాధితుల్ని తీసుకుని ఆత్మకూరు వెళ్లినట్లయితే.. ఏం జరిగి ఉండేదో కానీ… ఆపడం వల్ల… ఏపీలో ఏదో జరుగుతోందన్న భావన మాత్రం.. దేశం మొత్తం వ్యాపించేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ మీడియాను సమన్వయం చేసుకుని.. ప్రభుత్వం తరపున… అనుకూల వార్తలు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంలో… దేవులపల్లి అమర్ విఫలమయ్యారనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close