‘సైరా’ వివాదంపై స్పందించిన చ‌ర‌ణ్‌

ఓ ప‌క్క ‘సైరా’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే, మ‌రోవైపు వివాదాలూ త‌గ్గ‌డం లేదు. ‘సైరా’ విష‌యంలో మాకు అన్యాయం జ‌రిగింద‌ని ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వంశ‌స్థులు వివాదాన్ని రాజేశారు. అది అలా ర‌గులుతూనే ఉంది. ఈ విష‌యం కోర్టులో ఉండ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ మాట్లాడ‌లేదు. తాజాగా ఈ విష‌యంపై చ‌ర‌ణ్ స్పందించాడు. వందేళ్లు దాటితే ఎవ‌రి కథైనా చ‌రిత్ర అవుతుంద‌ని, దాన్ని సినిమాగా మ‌ల‌చుకునే హ‌క్కు అంద‌రికీ ఉంటుంద‌ని చ‌ర‌ణ్ గుర్తు చేశాడు. ఈ విష‌యంలో ఇది వ‌ర‌కు న్యాయ‌స్థానాలు ఇచ్చిన తీర్పుని చ‌ర‌ణ్ ఉటంకించాడు.

మంగ‌ళ‌పాండే క‌థ‌ని సినిమాగా తీస్తున్న‌ప్పుడు కూడా ఇలాంటి వివాదాలే వ‌చ్చాయ‌ని, కానీ అవేం నిల‌బ‌డ‌లేద‌న్నాడు చ‌ర‌ణ్‌. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి దేశం కోసం పోరాడార‌ని, అలాంటి వ్య‌క్తిని ఓ గ్రామానికో, కుటుంబానికో ప‌రిమితం చేయ‌డం ఇష్టం లేద‌ని, సైరా త‌ర‌పున ఏమైనా చేయాల్సివ‌స్తే – ఆ గ్రామానికి స‌హాయం చేస్తామ‌ని చ‌ర‌ణ్ ప్ర‌క‌టించాడు. వంద‌ల కోట్లు ఉన్నంత మాత్ర‌న ఇలాంటి సినిమాలు రావ‌ని, చ‌రిత్ర‌పై గౌర‌వం ఉన్న‌ప్పుడే `సైరా`లాంటి చిత్రాలు రూపుదిద్దుకుంటాయ‌న్నాడు చ‌ర‌ణ్‌. ఈ వ్యాఖ్య‌ల‌తో ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి వంశ‌స్థుల‌కు `సైరా` బృందం చేసేదేం లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. మ‌రి ఇప్పుడు వాళ్లంతా ఏ వైపుగా అడుగులు వేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close