శ్రీవారి సొమ్ము ఫలహారం..! జంబో కేబినెట్‌లా టీటీడీ బోర్డు..!

ఒక చైర్మన్..!
24 మంది పాలకమండలి సభ్యులు..!
నలుగురు ఎక్స్ అఫీషియే సభ్యులు..!
ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు…!

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని … భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి ఏర్పాటైన పాలక మండలి ఇది. మొత్తంగా 36 మంది. గతంలో ఎప్పుడూ.. ఇంత మంది పాలక మండలిలో లేరు. ఇప్పుడు మాత్రం… ఇంకా ఒత్తిడి వస్తే.. మరో పదిమందిని నియమించేలా… ప్రభుత్వం ఉంది. ఇంత మందితో… టీటీడీ బోర్డు పాలన సాగుతుందా..? పడకేస్తుందా..?

కేబినెట్‌కైనా పరిమితి.. టీటీడీ బోర్డుకు లేదా..?

రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యేల సంఖ్యలో పదిహేను మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవాలనే నిబంధన ఉంది. అందుకే ఇరవై ఐదు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను పరిపాలించడానికి ఇరవై ఐదు మంది మంత్రులు. కానీ.. రోజులకు లక్ష మంది అటూ ఇటుగా వచ్చే భక్తుల సౌకర్యాలు చూసుకోవడానికి ఏకంగా… చైర్మన్ తో కలిపి 36 మందితో పాలక మండలి. పాలక మండలికి చాలా పరిమితంగా సభ్యులు ఉండాలి. కానీ ప్రభుత్వాలు .. రాజకీయఅవసరాల కోసం.. టీటీడీని రాజకీయ పునరావాస శిబిరంగా మార్చేశాయి. కొత్త ప్రభుత్వం అయితే.. ప్రభుత్వ పెద్ద కేసుల్లోని సహచరులను… ఇతర రాజకీయ సంబంధాలతో వచ్చిన సిఫార్సులను.. అంగీకరించి.. ఎవర్నీ నొప్పించలేక.. అందరికీ.. టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. దానికి రకరకాల పేర్లు పెట్టారు. చివరికి అది 36 మందికి చేరింది.

శ్రీవారి సొమ్ము బోర్డుకు ఫలహారం..!?

టీటీడీ బోర్డు సభ్యుడంటే… కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కొండ పైన పర్మినెంట్ గా కాటేజీ, ఎప్పుడు వెళ్లినా అవసరాలు చూసుకోవడం, వాహనం, రోజుకు రెండు వందల బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇలా… చాలా సౌకర్యాలు ఉంటాయి. ఇవి కాకుండా.. తిరుమల కేంద్రం… వారి వారి సిఫార్సు లేఖలతో జరిగే వ్యాపారం అంతా ఇంతా కాదు. కొంత మంది పారిశ్రామిక వేత్తలు కూడా.. దర్శనం టిక్కెట్ల కోసం… టీటీడీ బోర్డు సభ్యత్వం తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీటీడీ ఈవోగా చేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తన ట్వీట్ లో అదే చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యులు.. టిక్కెట్ల కోసం తప్ప ఇంక దేనికీ ఉపయోగపడరని తేల్చి చెప్పారు. కానీ వారి వల్ల .. శ్రీవారికి ఏటా కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో అవినీతిపరులు ఉంటే.. జరిగే నష్టాన్ని అంచనా వేయలేం.

టీటీడీ బోర్డు వల్ల భక్తులకు ఏమైనా ఉపయోగం ఉందా..?

పాలమండలి అనేది.. శ్రీవారి సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కీలక నిర్ణయాలు ఆ కోణంలోనే తీసుకోవాలి. కానీ.. రాను రాను … రాజకీయ పునరావస కేంద్రంగా మారిపోయిన… టీటీడీ బోర్డు… భక్తుల సౌకర్యాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. నిజానికి పలువురు సభ్యులు… పాలక మండలి సమావేశాలకు కూడా.. పెద్దగా రారు. వారికి కావాల్సింది.. పాలక మండలి సభ్యుల హోదాలో.. వచ్చే ప్రయోజనాలు మాత్రమే. పరిమితంగా ఉంచాల్సిన బోర్డును… పంపకం చేసి… ఏపీ సర్కార్.. కొత్త ట్రెండ్ సృష్టించింది. స్వామి వారి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close