అన్నీ చంద్రబాబును అడగమంటే ఇక మంత్రిగా బొత్స ఎందుకు…?

రోడ్డు విస్తరణ పరిహారం కావాలా..? చంద్రబాబును అడగండి.. పొండి..!. .. ఈ మాటలన్నది సాక్షాత్తూ… ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన మంత్రి పదవిలో ఉండి… ప్రతిపక్ష నేతను.. అడగమని .. బాధితులు, నిర్వాసితులకు నిర్మోహమాటంగా చెప్పడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన బొత్స సత్యనారాయణను.. అక్కడ అభివృద్ధి పనుల్లో… ఆస్తులు కోల్పోయిన వారు వచ్చి పరిహారం కోసం డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం.. ఇవ్వాల్సిన పరిహారాన్ని వీలైనంత త్వరగా ఇప్పిస్తామని చెప్పాల్సిన మంత్రి అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. చంద్రబాబును అడగాలని చెప్పి కసురుకున్నారు. నంద్యాలలో అభివృద్ధి పనులు చంద్రబాబు హయాంలో ప్రారంభమయ్యాయి.

అందుకే బొత్స.. ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై బాధితుల్లోనే కాదు.. ఇతర నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రజలందరి బాగోగులు చూడాల్సింది ప్రభుత్వమే. అయితే ప్రస్తుత ప్రభుత్వం.. తాము.. వచ్చినప్పటి నుంచి చేసే పనులు మాత్రమే చేస్తామన్నట్లుగా వ్యహరిస్తోంది. గత ప్రభుత్వం.. చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలన్నట్లుగా.. లైట్ తీసుకుంటోంది. ప్రజలను కూడా.. పార్టీల వారీగా విభజించి పరిపాలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి రోడ్డు విస్తరణ పనులు.. నిర్వాసితులకు నిధులు.. ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు జరిగే కొద్దీ విడతల వారీగా చెల్లిస్తోంది. మిగిలి ఉన్న వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది.

ఓ సీనియర్ మంత్రిగా ఉండి.. బొత్స సత్యనారాయణ .. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను.. ఇవ్వాల్సిన పరిహారాలను చంద్రబాబును అడగమంటే… ఇక ప్రభుత్వంలో మీరెందుకు అన్న ప్రశ్న సహజంగానే ప్రజల వద్ద నుంచి వస్తుంది. మరి దీనికి బొత్స ఏమని సమాధానం చెబుతారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close