ఆ భార్య క్రిమినల్ మైండ్తో ఆలోచించింది. కానీ భర్త పోలీస్ మైండ్తో ముందుకెళ్లాడు. దీంతో సీన్ రివర్స్ అయింది. ఆమె ప్రియుడితో కలిసి భర్తకు విషం పెట్టి చంపాలనుకుంది..! ఆ భర్త వాళ్ల ఆడియో, వీడియోలు రికార్డు చేసి.. గుట్టు బయట పెట్టాడు..! సమస్యల పరిష్కారం కోసం.. ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టిన స్పందన కార్యక్రమంలో గుంటూరు పోలీసులకు వచ్చిన ఓ ఫిర్యాదు సారాంశం ఇదే. సినిమాటిక్ మలుపులు ఉన్న ఈ క్రైమ్ స్టోరీ పోలీసులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన యువకుడు బస్ డ్రైవర్. ఏడేళ్ల కింద అదే ప్రాంతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. అతని భార్య ఇంటి పక్కనే ఉండే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భార్యను చాలా సార్లు మందలించాడు. అయినా.. ఆమె వినిపించుకోలేదు. తరచూ.. అతనితో కలిసి గుంటూరు, హైదరాబాద్ లాంటి చోట్లకు వెళ్లి వస్తూండేది.
ఆమె గుట్టును బయట పెట్టాలనుకున్న బస్ డ్రైవర్.. తన తెలివి తేటల్ని ఉపయోగించి… వారి ఆడియోలు, వీడియోలు రికార్డు చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ బస్ డ్రైవర్ .. అంత టెక్నికల్గా వెళ్తారని.. ఊహించలేకపోయిన.. ఆ జంట… దొరికిపోయారు. ఆ వీడియోలు, ఆడియోలు విన్న బస్ డ్రైవర్ కూడా… ప్రాణభయంతో వణికిపోయారు. పోలీసుల వద్దకు పరుగులు పెట్టాడు. భార్య.. ఆమె ప్రియుడితో కలిసి.. తనను విషం పెట్టి చంపాలనే ప్లాన్ వేసినట్లు.. తను రికార్డు చేసిన ఆడియో, వీడియోల్లోనే బయటపడటంతో ఆయన స్పందన కార్యక్రమానికి పరుగులు పెట్టారు. తనను తన భార్య చంపాలనుకుంటోందని.. తాను రికార్డు చేసిన ఆడియోలు, వీడియోలు పోలీసులకు అందించారు. తన ప్రాణం కాపాడాలని విజ్ఞప్తి చేశాడు.
పోలీసులు కూడా.. వీటిని పరిశీలించి.. సినిమాటిక్ గా కథ ఉందని ఆశ్చర్యపోయి.. విచారణకు ఆదేశించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమానికి పోలీసుల వద్దకు.. ఇలాంటి కుటుంబ పంచాయతీలే ఎక్కువగా వస్తున్నాయి. ప్రేమించి మోసం చేసిన కేసులు.. వివాహేతర బంధాలు లాంటి కేసులు.. ఎక్కువగా వస్తున్నాయి. ప్రజల సమస్యలను తప్పని సరిగా పరిష్కరించాలని సీఎం ఆదేశిస్తూండటంతో.. పోలీసులు వీటిపై దృష్టి పెట్టక తప్పడం లేదు.