సైరా నరసింహారెడ్డి చివరి గండాన్ని విజయవంతంగా అధిగమించారు. ఈ చిత్రం విడుదలను నిలుపు చేయాలంటూ.. హైకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టివేశారు. సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సైరా చిత్రంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఉయ్యాలవాడ వంశీకులు.. అలాగే మరికొంత మంది కుల సంఘాలు… సినిమా విడుదలకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు వేశారు. వాటన్నింటికీ.. క్లారిటీ ఇవ్వడానికి అసలు సైరా సినిమా బయోపిక్ కాదని… సినిమా బృందం కోర్టులో వాదించింది. దీనిపై.. నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. మొదట బయోపిక్ అని చెప్పి చరిత్రను తప్పుదోవ పట్టించారని పిటిషన్ లో కేతిరెడ్డి ఆరోపించారు. అయితే కేతిరెడ్డి వాదనను హైకోర్టు తప్పు పట్టింది. సినిమాను కేవలం వినోదపరంగా చూడాలని స్పష్టం చేసింది.
ఎంతోమంది మహానుభావుల చరిత్రను .. ఉన్నది ఉన్నట్టు ఎవరూ చూపించలేదని.. హైకోర్టు స్పష్టం చేసి.. కేతిరెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సైరాకు న్యాయపరమైన వివాదాలన్నీ తొలగిపోయినట్లయింది. నిజంగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా… సైరాను ప్రచారం చేస్తున్నప్పటికీ.. చరిత్రను పూర్తి స్థాయిలో వక్రీకరించారన్న అభిప్రాయం మొదటి నుంచి ఉంది. తెల్లదొరపై.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా ముందు… చాలా మంది పోరాడారు. ఉత్తరాదికి చెందిన ఆ పోరాట యోధుల గురించి పూర్తి స్థాయిలో మర్చిపోయి… ఉయ్యాలవాడనే తొలి పోరాటయోధుడని సినిమాటిక్ చరిత్ర వక్రీకరణతో ప్రచారం చేస్తున్నారు.
అయితే.. ఉయ్యాలవాడు పోరాటం ఎందుకు జరిగిందనే దానిపైనా.. చాలా విశ్లేషణలు ఉన్నాయి. వీటన్నింటి మధ్య… అసలు ఇది బయోపిక్ కాదని చెప్పడమే సమస్యలకు పరిష్కారమని… దర్శకుడు సురేందర్ రెడ్డి ఫిక్సయ్యారు. అదే చేశారు. ఎలాగోలా.. కోర్టు కేసుల నుంచి సైరా బయటపడి.. విడుదలకు సిద్ధమయ్యారు.