వెంకీ సినిమా ఎందుకు ఆగిపోయింది?

ఎఫ్ 2తో సూప‌ర్ హిట్ కొట్టిన వెంకీ.. ఆ త‌ర‌వాత సినిమాల ఎంపిక‌లో వేగం చూపించాడు. వెంకీ మామా ప‌ట్టాల‌పై ఉండ‌గానే నాలుగు క‌థ‌ల్ని ఒకే చేసుకున్నాడు. అయితే.. ఆ సినిమాల విష‌యంలో ఇంకా వెంకీ ఓ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నాడు. వెంకీ కోసం క‌థ‌లు సిద్ధం చేసుకున్న ద‌ర్శ‌కుల జాబితాలో ఉన్న త్రినాథ‌రావు న‌క్కిన‌.. ఇప్పుడు ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు కూడా. అలా వెంకీ చేతిలోని క‌థ జారిపోయిన‌ట్టైంది. హ‌లో గురు ప్రేమ కోస‌మే త‌ర‌వాత త్రినాథ‌రావు న‌క్కిన తో వెంకీ సినిమా ఓకే అయ్యింది. అప్ప‌ట్లో త్రినాథ‌రావు ఓ లైన్ చెప్ప‌డం, అది వెంకీకి న‌చ్చ‌డం జ‌రిగాయి. అయితే.. ఆ లైన్‌ని క‌థ‌గా డవ‌లెప్ చేయ‌డంలో త్రినాథ‌రావు బాగా ఆల‌స్యం చేశాడు. అంతే కాదు.. ఈ ప్రాజెక్టులోకి సురేష్‌బాబు ఎంట్రీ ఇచ్చాక స‌మీక‌ర‌ణాలు మారాయి.

వెంక‌టేష్ కోసం ఓ పోలీస్ పాత్ర‌ని సృష్టించుకున్నాడు త్రినాథ‌రావు. ఆ క‌థ‌లో ప‌టాస్‌, టెంప‌ర్ ల‌క్ష‌ణాలు మెండుగా క‌నిపించాయ‌ట‌. అంతేకాదు.. ఇందులో పాత్ర‌లో అప‌రిచితుడు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌. కొన్నిసార్లు నిజాయ‌తీప‌రుడిగా, ఇంకొన్నిసార్లు లంచ‌గొండిగా వెంకీ పాత్ర క‌న్‌ఫ్యూజ్ చేస్తుంటుంద‌ని, లైన్‌గా చెప్పిన‌ప్పుడు ఆ పాత్ర బాగున్నా.. ట్రీట్‌మెంట్ పూర్త‌య్యాక కిక్ త‌గ్గింద‌ని, అందుకే క‌థ మార్చ‌మ‌ని త్రినాథ‌రావుని ఫోర్స్ చేయ‌డం ప్రారంభించార‌ని, అది న‌చ్చ‌క త్రినాథ‌రావు ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. అలా.. వెంకీ చేయాల్సిన ఓ సినిమా ఆగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close