మోడీతో జగన్ భేటీ..! విన్నపాలు కన్నా వివరణలే ఎక్కువ..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎప్పుడు కలిసినా అడుగుతానన్నవి అడుగుతారు. కానీ.. అడగకపోయినా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాలుగు నెలల కాలంలోనే… కేంద్రాన్ని ధిక్కరించేలా తీసుకున్న అనేక నిర్ణయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాల్లో అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. చేసిందంతా చేసి.. ఇప్పుడు.. కేంద్రం సాయం కోసం వెళ్తే .. ప్రధాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం..!. నాలుగు నెలల కాలానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల కు సంబధించి పూర్తి స్థాయి వివరణలను… అధికారులు సిద్ధం చేశారు.

కరెంట్ కొరతకు కారణం ఏమని చెబుతారు..?

ఆంధ్రప్రదేశ్‌కు అదనపు బొగ్గు కేటాయించాలని.. విద్యుత్ కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లో కేంద్రానికి ఓ లేఖ రాశారు అధికారులు. అయితే.. దానికి స్పందనేమీ కనిపించ లేదు. విద్యత్ కొరత అంతకంతకూ తీవ్రమవుతున్నందున.. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా మోదీని మరింత బొగ్గు కోసం విజ్ఞప్తి చేస్తారు. కానీ.. ఐదేళ్లు నిరంతర విద్యుత్ ఉన్న రాష్ట్రానికి ఇప్పుడెందుకీ కష్టాలు అని.. ప్రధానమంత్రి నుంచి కానీ.. పీఎంవో అధికారుల నుంచి కానీ వస్తే.. ఏపీ సీఎం సమాధానం చెప్పుకోలేరు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేయడంతోనే సమస్య వచ్చిందని జగన్ అంగీకరించలేరు. ఎందుకంటే.. ఈ ఒప్పందాల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరును.. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. సాక్షాత్తూ కేంద్ర విద్యుత్ మంత్రే.. హెచ్చరికల్లాంటి సూచనలు చేశారు. అయినా… ఏపీ సీఎం వెనక్కి తగ్గలేదు. తాను చేయాలనుకున్నదే చేశారు. ఇప్పుడు కరెంట్ లేదని.. బొగ్గు కావాలంటూ.. కేంద్రం వద్దకువెళ్తున్నారు.

పోలవరం రివర్స్‌పై ఏం వివరణ ఇవ్వబోతున్నారు..?

పోలవరం రివర్స్ టెండర్లపైనా .. ప్రధానికి జగన్మోహన్ రెడ్డివివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. నిర్మాణ నిర్వహణ మాత్రమే ఏపీ సర్కార్ ది. ఏ నిర్ణయం అయినా కేంద్ర ప్రభుత్వం .. నియమించిన పోలవరం ప్రాజెక్ట్ ఆధారిటీ ద్వారానే తీసుకోవాలి. జలశక్తి మంత్రి అంతిమ నిర్ణయం తీసుకోవాలి. పీపీఏ అనుమతి లేకుండా.. టెండర్లు పిలిచే అధికారం కూడా ఏపీ సర్కార్ కు లేదు. అయినప్పటికీ పీపీఏ వద్దన్నా.. కోర్టు స్టే ఉన్నా టెండర్లు ఖరారు చేసేశామని.. 8వందల కోట్లు ఆదా చేశామని గంభీరమైన ప్రకటనలు చేస్తోంది. అంటే.. అంతకు తగ్గ అవినీతి జరిగిందని.. ప్రచారం చేస్తున్నారు. ఈ రివర్స్ టెండర్ల లోగుట్టేమిటో.. బీజేపీ నేతలకు ఇప్పటికే క్లారిటీ ఉంది. ఈ విషయాన్ని కన్నా.. నివేదిక రూపంలో కేంద్రానికి అందించారు. ఇప్పుడు వాటిపై.. జగన్ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదో.. జగన్.. ప్రధానికి క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది.

జీఎస్టీ ఆదాయం పడిపోవడానికి ఏం లెక్కలు చెబుతారు..?

రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జీతభత్యాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. కేంద్రం ఆదుకోవాలని.. ఏపీ సీఎం కోరడం సహజమైన విషయం . కానీ .. ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎందుకు తగ్గిపోయిందంటే.. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారు..?. పరిణితి లేని నిర్ణయాలతో ఇసుక అందుబాటులో లేకుండా చేసినందున… వ్యాపార వ్యవహారాలు తగ్గిపోయాయని చెబుతారా..?. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి పనిని.. నిలిపి వేసినందుకు ఆదాయం తగ్గిపోయిందని చెబుతారా..?. వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్న అమరావతిని ఆపేసినందుకు ఆదాయం తగ్గిపోయిందని చెబుతారా…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close