తమిళిసైతో చిరంజీవి ప్రత్యేక భేటీ..! రాజకీయం లేదు..!?

తెలంగాణ గవర్నర్ తమిళిశైను.. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆమెను చిరంజీవి మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా చెబుతున్నారు. తన సినిమా సైరా నరసింహారెడ్డిని చూసేందుకు తమిళిశైను.. చిరంజీవి ఆహ్వానించారు. గవర్నర్ సినిమా చూసేందుకు సమయం కేటాయిస్తే.. ఆ సమయంలో ప్రత్యేక షో వేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేయనుంది. అయితే.. ఇంత వరకూ… చిరంజీవి ఇలా ప్రత్యేకంగా రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారిని కానీ.. రాజకీయ నాయకుల్ని కానీ.. కలిసి… తన సినిమా చూడాలని ఆహ్వానించలేదు. ప్రత్యేకంగా తెలంగాణ గవర్నర్ ను ఆహ్వానించడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవికి – బీజేపీకి లింక్ పెట్టి కొద్ది రోజులుగా… రాజకీయ ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో.. రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కథను.. తన తర్వాతి సినిమాకు చిరంజీవి ఎంచుకున్నారని చెబుతున్నారు. మలయాళంలో హిట్ అయిన మోహన్ లాల్ సినిమా లూసిఫర్ సినిమా రైట్స్ ను.. చిరంజీవి తీసుకున్నారని.. మలయాళ హీరో ఫృధ్వీరాజ్ ప్రకటించారు. అందులో ఆజ్ఞాతంలో ఉన్న డాన్ గా… భారీ ప్రజాదరణ ఉన్న రాజకీయ నేతగా మోహన్ లాల్ నటించారు. తన పదవి కోసం కాకుండా.. తన వాళ్లని పదవి ఎక్కించడానికి మోహన్ లాల్ అందులో ప్రయత్నిస్తారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమాను చిరంజీవి ఎంపిక చేసుకోవడంతోనే… టాలీవుడ్‌లో కాస్త చర్చ నడుస్తోంది.

ఇప్పుడు.. సినిమా చూసేందుకు ఆహ్వానించే పేరుతో… తమిళశైతో భేటీ కావడం కూడా… యాధృచ్చికం కాదంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా…. ఆశ్చర్యం లేదన్న చర్చ.. సహజంగానే… రాజకీయాల్లో వస్తుంది. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అనడం…రాజకీయాల్లో చాలా సహజమైన విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close