రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధి ఆత్మహత్య

వేధింపుల కారణంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. అతనికి న్యాయం చేయాలని యూనివర్సిటీ విద్యార్ధులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ సమస్య పరిష్కారం కాకముందే మళ్ళీ మోహిత్ చౌహాన్ (27) అనే మరొక పి.హెచ్.డి. విద్యార్ధి రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న తన హాస్టల్ గదిలో ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను కూడా వేధింపుల భరించలేకనే ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని పి.హెచ్.డి.కి గైడ్ గా ఉండి మార్గదర్శనం చేస్తున్న అతని ప్రొఫెస్సర్ వేధింపుల కారణంగానే మోహిత్ చౌహాన్ ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది.

అతను తమతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మానసిక ఒత్తిడికి గురయినట్లు కనిపించాడని కానీ ఆత్మహత్య చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు ఎటువంటి మాటలు అనలేదని అతని స్నేహితులు చెప్పారు. తమతో కబుర్లు చెపుతూ మధ్యలో తన గదికి వెళ్లిపోయాడని, అతను ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే అతను ఫ్యానుకి ఉరేసుకొని కనపడ్డాడని వారు తెలిపారు. తాము అతనిని చూసేసరికే చనిపోయున్నాడని వారు తెలిపారు.

అతని గది నుండి కొన్ని కాగితాలు, అతనికి సంబంధించిన పుస్తకాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అతని ఆత్మహత్యకి కారణం తెలుపుతూ సూసైడ్ నాట్ వ్రాశాడా లేదా? అనే విషయం ఇంకా తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బారీగా పోలీసులను మొహరించారు.

ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. రాజకీయ నాయకులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి తరలివచ్చినట్లుగా అక్కడికి కూడా తండోపతండాలుగా తరలి వస్తే అక్కడ కూడా పరిస్థితులు జటిలంగా మారవచ్చును. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉంది కనుక అక్కడికి కూడా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు తరలివచ్చే అవకాశం ఉందని భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close