కరెంట్ నష్టాలను మీరే భరించండి..! కేంద్రానికి రివర్స్‌లో ఏపీ ఘాటు లేఖ..!

ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల సమీక్ష విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను కేంద్రం పదే పదే తప్పు పడుతూండటంతో ఏపీ సర్కార్ ఎదురుదాడి ప్రారంభించింది. పీపీఏల వల్ల తమ రాష్ట్రానికి ఏటా రూ. ఐదు వేల కోట్ల నష్టం జరుగుతోందని… కేంద్రం కొంత మేర భరించాలంటూ… నేరుగా కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్‌కు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో బాలినేని పేర్కొన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌ కారణంగా ఏటా రూ.5వేల కోట్ల భారం పడుతోందని… గత నాలుగేళ్లుగా పరిమితికి మించి సోలార్‌, విండ్‌ పవర్‌ కొంటున్నామని లేఖలో పేర్కొన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌కి కేంద్రం సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌రంగంలో సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్చలు జరుపుతున్నామని.. విద్యుత్‌రంగంలో సంక్షోభానికి పరిష్కారం కోసం కేంద్రం కమిటీ వేయాలని బాలినేని లేఖలో కోరారు.

గత సర్కార్ హయాంలో జరిగిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్న ఏపీ సర్కార్ ను.. కేంద్రం పదే పదే హెచ్చరించింది. ఆ నిర్ణయాల వల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం పడుతోందని… హెచ్చరించింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు. చాలా వరకు రద్దు చేశారు. ఆయా కంపెనీలు కోర్టుకెళ్లడంలో వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఇప్పుడు… ఈఆర్సీ ద్వారా ఆ ఒప్పందాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీల విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. ఈ విషయాలపై కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ పలుమార్లు లేఖలు రాశారు. ఒప్పందాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టమైన హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నారు.

సౌర, పవన విద్యుత్ ను… ప్రభుత్వం కొనుగోలు చేయడం నిలిపివేయడంతో ఏపీ సర్కార్ విద్యుత్ సంక్షోభంలో పడింది. అదనపు విద్యుత్ కోసం.. యూనిట్ కు రూ. పన్నెండు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రూ. నాలుగుకు వచ్చే సౌర, పవన విద్యుత్ కొనుగోలు నిలిపివేసి.. అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఇలా కొనడానికి కూడా చంద్రబాబే కారణమని విమర్శలు చేస్తూ.. తమకు వచ్చే నష్టాలను కేంద్రం భరించాలంటూ.. ఏకంగా లేఖ రాసేశారు. ఏపీ సర్కార్ తీరుపై కేంద్ర ప్రభుత్వంలోనూ విస్మయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై !

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన 2014-19 వరకు ఐదేళ్ల పాటు టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లు పార్టీలోనే ఉన్నా...
video

మిస్టర్ బచ్చన్ షో రీల్: రైడ్ కి ఓ కొత్త లేయర్

https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak హరీష్ శంకర్ లో మంచి మాస్ టచ్ వుంది. ఆయన ఏ కథ చెప్పినా మాస్ అప్పీలింగ్ తో తయారు చేస్తుంటారు. రిమేకులు చేయడంలో కూడా ఆయనకి సెపరేట్ స్టయిల్ వుంది. దబాంగ్...

హోంమంత్రి అనిత … వనితలా కాదు !

ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా...

జగన్ అహానికి ప్రజల పరిహారం పోలవరం !

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close