రవిప్రకాష్‌పై మరో కేసు..! మళ్లీ రిమాండ్..!

టీవీ9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాష్‌పై “బోనస్” కేసు విషయంలో నవంబర్ రెండో తేదీ వరకూ ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు రూటు మార్చారు. వెంటనే రవిప్రకాష్‌పై మరో కేసు నమోదు చేశారు. నటరాజన్, ఐ ల్యాబ్ పేరుతో.. ఫేక్ ఈమెయిల్ ఐడీ సృష్టించారనేది ఆ కేసు. ఆలా కేసు నమోదు చేసి.. అలా ఆయనను చంచల్ గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకున్నారు. రవిప్రకాష్‌ను మియాపూర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు బోనస్ కేసులో బెయిల్ వచ్చినా.. ఆయన ఫేక్ ఐడీ కేసులో… జైల‌ులోనే ఉండాల్సిన పరిస్థితి కల్పించారు.

రవిప్రకాష్‌పై నమోదైన కొత్త కేసులో అసలు ఫిర్యాదు దారు ఎవరు.. ? అన్నదానిపైనా స్పష్టత లేకుండా పోయింది. ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తారా.. అన్న నోరెళ్లబెట్టడం… ఇతరుల వంతు అయింది. ఐ ల్యాబ్ పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఈమెయిల్ ఐడిని రవిప్రకాష్ క్రియేట్ చేశారనేది అసలు ఆరోపణ. అందుకే.. ఐటీ యాక్ట్ 406/66 కింద సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే… పోలీసులు ఇలా కేసులో.. అరెస్టులు చూపిస్తున్నారని.. రవిప్రకాష్ వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

నిజానికి గతంలో ఇలా టీవీ9 కొత్త యాజమాన్యంతో ఏర్పడిన వివాదాల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ షరతుల ప్రకారం… పోలీసుల ముందు హాజరవుతున్నారు. అలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం రాదనేది… న్యాయనిపుణుల వాదన. నిందితుడు పారిపోతాడన్న అనుమానం ఉంటేనే అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న కేసుల్లోనూ రవిప్రకాష్‌పై కేసులు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఇదే న్యాయవాద వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close