కొత్తపలుకు : జగన్‌కు ఆర్కే సవాల్..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ … అనుకున్నట్లుగానే ఈ వారం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సూటిగా గురిపెట్టారు. తన వారంతాపు ఆర్టికల్ “కొత్త పలుకు”లో.. అవినీతిపై విచారణకు సవాల్ విసిరారు. ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటూ.. కేబినెట్ నిర్ణయం తీసుకోవడం.. ఆంధ్రజ్యోతిపై సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. రాధాకృష్ణ.. తన వారాంతపు ఆర్టికల్‌లో.. జగన్ ను టార్గెట్ చేస్తారని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగానే ఆ భూమి విషయంలో తన వాదన వినిపించిన వేమూరి రాధాకృష్ణ.. జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. రూ. 43వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధారించిన జగన్.. అందరికీ అవినీతి ముద్ర పూయాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. తన భూమి విషయంలో ప్రభుత్వం చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. ఆ భూమితో పాటు.. దాని కోసం కట్టిన రూ. 50 లక్షలు వదులుకుంటాని సవాల్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి రూ. 43వేల కోట్ల అవినీతికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో.. తాను ఎంత సచ్చీలుడినో చెప్పుకునేందుకు వైఎస్ హయాంలో.. తనకు ఇవ్వబోయిన ఓ తాయిలం గురించి ఆర్కే బయట పెట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో.. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో.. జూబ్లిహిల్స్‌ చెక్ పోస్ట్ దగ్గర అత్యంత విలువైన స్థలాన్ని ఆంధ్రజ్యోతికి కేటాయించేందుకు సిద్ధమని సమాచారం పంపారట. అయితే.. దానికి కొన్ని షరతులు పెట్టారంటున్నారు. దానికి తాను అంగీకరించలేదని.. అందుకే స్థలం పొందలేదని.. అదే తన నిజాయితీకి గుర్తని.. ఆర్కే చెప్పుకొచ్చారు.

అయితే.. రాధాకృష్ణ.. ఈ అంశాన్ని హైలెట్ చేసినప్పటికీ… మొదట్లో మాత్రం తనది ప్రజాప్రయోజనాల బాణి అని చెప్పేందుకు… రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనా విమర్శలు చేశారు. సంక్షేమ పథకాల పేరుతో.. మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె తరహాలో.. ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. అప్పులు చేసి మరీ… ఇలా ప్రజలకు డబ్బులు పంచుతూ పోతే.. ఎదురయ్యే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుద్ది జీవులు స్పందించాలని… పిలుపునిచ్చారు.

తాను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటానన్న విషయాన్ని.. ఆర్టికల్‌లో వేమూరి రాధాకృష్ణ బహిరంగంగా ఒప్పుకున్నారు. తాను.. ఎన్టీఆర్ హయాం నుంచి జర్నలిజంలో ఉన్నానని… అప్పట్లో ఎన్టీఆర్.. ఆ తర్వాత చంద్రబాబు హైదరాబాద్ ను చేసిన అభివృద్ధి.. అమరావతి విషయంలో చంద్రబాబు విజన్…అన్నీ చూడటం వల్ల.. చంద్రబాబు రాజకీయాల కన్నా అభివృద్ధికి పెద్ద పీట వేస్తారని నమ్మడం వల్లే.. పలు సందర్భాల్లో ఆయనకు మద్దతుగా నిలబడినట్లుగా చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసమే.. చంద్రబాబు వెంట ఉన్నట్లుగా.. ఆర్కే స్పష్టం చేశారు. అదే సమయంలో జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజధాని లేని నవ్యాంధ్రకు… అమరావతిలో ఊహించని రీతీలో అభివృద్ధి చేస్తే.. ఆయనకూ మద్దతిస్తామని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close