చంద్రబాబులాగే జగన్ నిందలేస్తున్నారంటున్న బీజేపీ..!

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ..తన వైఫల్యాలను బీజేపీపై నెట్టడానికి చేసిన ప్రయత్నమా..? కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని గతంలో చంద్రబాబు చేసినట్లుగా ప్రచారం చేసుకునే ప్రయత్నమా..? అవునని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. హోంమంత్రి అపాయింట్ మెంట్ ఖరారు కాకుండానే ఢిల్లీకి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి … అందుబాటులో ఉన్నప్పటికీ.. తనకు సమయం ఇవ్వలేదని ప్రచారం చేయించుకున్నారు. ఆ తర్వాత అమిత్ షాకు.. ఏపీకి సంబంధించిన అన్ని అంశాలపై వివరించామని.. సానుకూలంగా స్పందించారని మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఎన్నెన్నో ఇవ్వాలన్నట్లుగా…జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం… అవన్నీ ఇవ్వడం లేదన్నట్లుగా జగన్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో బీజేపీ నేతలు అలర్టయ్యారు.

ఎంపీ సుజనా చౌదరి వెంటనే స్పందించారు. జగన్‌ ఢిల్లీ యాత్ర చేసి బీజేపీపై నిందలు వేసే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక విధానమే కాదని.. ఏ ఒక్క విధానమూ సక్రమంగా లేదని మండిపడ్డారు. అవినీతి ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదన్నారు. ఓ వైపు.. జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వైసీపీ ఈ ప్రచారాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటోందని… బీజేపీ నేతలకు అర్థం అయింది.

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా.. ఏం వినతి పత్రాలు ఇస్తున్నారో కానీ.. అధికారిక ప్రకటనలు మాత్రం చేయడం లేదు. వారికిచ్చిన వినతి పత్రాలను విడుదల చేయడం లేదు. కానీ.. మీడియాకు ఇచ్చే సమాచారంలో మాత్రం.. గతంలో.. చంద్రబాబు ఎన్ని డిమాండ్లు కేంద్రం ముందు పెట్టేవారో.. అవన్నీ ఉంటున్నాయి. అప్పట్లాగే కేంద్రం ఏమీ చేయడం లేదన్న అభిప్రాయాన్ని… మాత్రం వైసీపీ అధినేత కల్పిస్తున్నారు. బీజేపీని ప్రజల్లో విలన్ చేసేందుకు వైసీపీ కూడా చంద్రబాబు బాటలో వెళ్తోందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close