ఎన్టీఆర్‌తో అట్లీ సినిమా.. ఖాయ‌మైన‌ట్టే!

తమిళ ద‌ర్శ‌కులంటే మ‌న‌వాళ్ల‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. మురుగ‌దాస్ లాంటి వాళ్ల‌కు ఎర్ర తివాచీలు ప‌రుస్తుంటారిక్క‌డ‌. ఇప్పుడు ఈ జాబితాలో అట్లీ పేరు చేరింది. వ‌య‌సు చిన్న‌దైనా, పెద్ద హిట్లు కొట్టి మ‌న హీరోల దృష్టిలో ప‌డిపోయాడు అట్లీ. ఇప్పుడు విజ‌య్‌తో `విజిల్` కొట్టిస్తున్నాడు. ఆ వెంట‌నే షారుఖ్ ఖాన్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఎన్టీఆర్‌తో అట్లీ ఓ సినిమా చేస్తాడ‌ని గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే షారుఖ్ సినిమా వ‌చ్చేస‌రికి, ఎన్టీఆర్ తో ప్రాజెక్టు పెండింగ్‌లో ప‌డిపోయిన‌ట్టైంది. ఈ కాంబో ఉంటుందా, లేదా? అనే డౌట్ల‌ని అట్లీ ప‌టాపంచ‌లు చేశాడు. ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుంద‌న్న సంకేతాలు గ‌ట్టిగానే ఇచ్చాడు.

విజిల్ ప్ర‌చారం కోసం హైద‌రాబాద్ వ‌చ్చాడు అట్లీ. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ టాపిక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాద‌ని, త‌న నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే, ఎన్టీఆర్ ఫో్న్ చేసి మ‌రీ అభినందిస్తుంటాడ‌ని, త‌న‌కోస‌మైనా తెలుగులో ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు అట్లీ. త‌న మాట‌లు వింటుంటే.. ఎన్టీఆర్‌తో త‌ర‌చూ ట‌చ్‌లో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. అంతేకాదు… తెలుగులో తాను సినిమా చేస్తే అది ఎన్టీఆర్‌తోనేన‌ని, అయితే.. అదెప్పుడో తాను కూడా చెప్ప‌లేన‌ని, అతి త్వ‌ర‌లో ఉంటుంద‌న్న న‌మ్మ‌కం మాత్రం ఉంద‌ని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌య్యేలోగా అట్లీ షారుఖ్ సినిమా ముగించుకుంటే.. ఆ వెంట‌నే ఈ కాంబో చూసేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close