చిరు@152… త్రిష ఔట్‌!

చిరంజీవి – కొర‌టాల శివ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రాకి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వ‌చ్చే నెల‌లోనే షూటింగ్ మొద‌లెడ‌తారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లో అప్పుడే ఓ ప్ర‌త్యేక‌మైన సెట్ కూడా వెల‌సింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థానాయిక ఎవ‌రన్న‌ది తేల‌లేదు. న‌య‌న‌తార‌, అనుష్క‌, శ్రుతిహాస‌న్‌, త‌మ‌న్నా… ఇలా చాలా పేర్లు వార్త‌ల్లో వినిపించాయి. ఇటీవ‌ల త్రిష పేరైతే బాగా చ‌క్క‌ర్లు కొట్టింది. త్రిష ఎంపిక దాదాపుగా ఖాయ‌మైపోయింద‌నుకున్నారు. కానీ… ఏమైందో ఏమో గానీ, త్రిష ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యింది.

ఈ విష‌యాన్ని త్రిష‌నే చెప్పింది `చిరంజీవిగారి సినిమాలో న‌టిస్తున్నాన‌న్న వార్త‌ల్లో నిజం లేదు. ఆ సినిమాలో నేను లేను. ఆ అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తా` అంటూ పేర్కొంది. త్రిష‌తో చిత్ర‌బృందం సంప్ర‌దింపులు జ‌రిపింది. ఈ చిత్ర బృందంలోని ఓ ప్ర‌ముఖుడు ఇటీవ‌ల చెన్నై వెళ్లి త్రిష‌ని క‌లిశారు కూడా. ఈ ఆఫ‌ర్ నా వ‌ర‌కూ రాలేద‌న్న త్రిష మాట‌లో నిజం లేన‌ట్టే. కాక‌పోతే.. ఈ సినిమా చేయ‌న‌ని త్రిష చెప్పిందా, లేదంటే చిత్ర‌బృంద‌మే మ‌న‌సు మార్చుకుందా? అనేది తెలియాల్సివుంది. త్రిష ఆప్ష‌న్ కూడా ప‌క్కకు వెళ్లిపోవ‌డంతో… ఇప్పుడు ఈ సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న ప్ర‌శ్న మ‌ళ్లీ ఉత్ప‌న్న‌మైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close